సారంపల్లి మల్లారెడ్డి
రుణమాఫీ
- 2008
- 2009
- 2010
- 2011
- 2012
- 2013
- 2014
- FDI
- అఖిలభారత మహాసభలు
- ఆహార భద్రత
- ఉపాధి హామీ పథకం
- ఎన్నికలు
- ఎరువుల కర్మాగారం
- కరువు
- కార్మిక రంగం
- కుల నిర్మూలన
- గ్రామ పంచాయితలు
- చెఱకురైతులు
- చేతి వృత్తులు
- త్రాగునీటి
- ప్రపంచీకరణ
- ప్రాజెక్టులు
- ప్రెస్ నోట్
- బడ్జెట్
- బుక్స్
- బ్యాంక్స్
- భూ పోరాటాలు
- రాష్ట్ర మహాసభ
- రుణమాఫీ
- రైతు సమస్యలు
- విత్తనలు
- విద్యుత్ రంగం
- వీర తెలంగాణ చరిత్ర
- వ్యవసాయం
Sunday, 6 January 2019
Thursday, 14 August 2014
2014 సాధారణ ఎన్నికలు ` రాజకీయ పరిస్థితులు
16వ లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుత లోక్సభ మే 31న ముగుస్తుందని, 16వ లోక్సభ ఎన్నికల ప్రక్రియ మార్చి 15న ప్రారంభమవుతుందని, ఏడు దశల్లో దేశవ్యాపితంగా ఎన్నికలు జరుగుతాయని, 8 లక్షల పోలింగ్ బూత్లలో 12 లక్షల ఈవీఎంల ద్వారా 78 కోట్ల మంది ఓటింగ్లో పాల్గొంటారని, పోలింగ్కు మూడు వారాల ముందు ఎన్నికల నోటిఫికేష్ జారీ చేస్తామని, పోలింగ్కు ఆరు వారాల ముందు ఎన్నికల తీదీలను ప్రకటిస్తామని, అప్పటి నుండి ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని, జూన్ 1 కల్లా 16వ లోక్సభ ఏర్పాటవుతుందని భారత ఎన్నికల ప్రధాన కమిషన్ ప్రకటించింది.
2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని జనవరి 3న ఢల్లీిలో ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించారు. గత పదేళ్ళల్లో ప్రధాని అధికారికంగా నిర్వహించిన మూడవ విలేకరుల సమావేశం ఇది. ‘‘వచ్చే ఎన్నికల్లో తాను ప్రధాని అభ్యర్థిని కాదని, యుపిఏ`3లో కొత్త ప్రధాని బాధ్యతలు చేపడతారని, రాహుల్గాంధీ ప్రధాని పదవికి అర్హుడని, గ్రామీణ ఉపాధిహామీపథకం` లోక్పాల్బిల్లు` సమాచారహక్కు చట్టం కంటే అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందమే తనకు అత్యంత ఆనందకరమైనదని, పాలనలో అక్రమాలు జరిగినమాట నిజమేనని, నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయలేకపోయామని, మిగిలిన ఐదు నెలల కాలంలో సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెల్తామని మన్మోహన్ ప్రకటించారు.
2014 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉంటే రాహుల్ను ప్రధానిగా ముందుకు తెచ్చే విధంగా పార్టీ వ్యూహరచన చేసింది. ఎన్నికల అనంతరమే ప్రధానిని ప్రకటిస్తామని, రాహుల్కు ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పజెప్పుతున్నట్లు జనవరి 16న జరిగిన సిడబ్ల్యుసీలో నిర్ణయం తీసుకున్నారు.
దేశంలో నిరుద్యోగానికి, దారిద్య్ర పెరుగుదలకు 14.9.2012న ఎఫ్డిఐ రాకపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం చేసింది. ఎఫ్డిఐ ప్రవేశాన్ని రాష్ట్రాలే నిర్ణయించుకోవాలి. కేంద్రంపై ఆందోళనలు రాకుండా ఈ పరిమితి పెట్టారు.
10 లక్షల జనాభా కలిగిన 51 పట్టణాలలోని చిల్లర దుకాణాలకే ఇది పరిమితం చేసారు. చిల్లర దుకాణాల్లోకి 30శాతం దేశీయ ఉత్పత్తుల సమీకరణ చేయాలి. మిగిలిన 70శాతం విదేశీ దిగుమతుల ద్వారా సేకరించాలి. అనగా విదేశీ దిగుమతులకు ప్రోత్సాహం కల్పించడానికి ఎఫ్డిఐ (ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్) ద్వారా దేశీయ చిల్లర దుకాణాలదారులను కోట్ల సంఖ్యలు నిరుద్యోగులు చేయతలపెట్టారు.
బహుళబ్రాండ్ల రిటేయిల్ వర్తకంలో 51శాతం, బ్రాడ్కాస్టింగ్లో 74శాతం, విమానయాన రంగంలో 49శాతం, ప్రభుత్వ కంపెనీల విక్రయం, విద్యుత్ పవర్ ట్రేడిరగ్ ఎక్స్చేంజీలలో 49శాతం పెంచారు. అంతకు ముందు సింగిల్ బ్రాండ్లో 51శాతం ఉండగా దానిని 100శాతానికి పెంచారు. 25 మహా, నవరత్న కంపెనీల నిల్వలను కేంద్ర ప్రభుత్వానికి జమచేయాలని ప్రధాని ఆదేశం. దేశ బడ్జెట్కు లోటును పూడ్చుకోవడానికి లాభాల్లో ఉన్న ప్రభుత్వ కంపెనీలలోని నిల్వను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి కేంద్రం కుట్రలు కొనసాగిస్తున్నది. పైగా ప్రభుత్వ కంపెనీల విక్రయాన్ని ‘‘వాటాల ఉపసంహరణ’’ పేరుతో నిధులు సేకరిస్తున్నారు.
నాలుగు ప్రభుత్వ కంపెనీల విక్రయం :
ప్రభుత్వ రంగంలోని నాలుగు సంస్థలను ఎఫ్డిఐల అనుమతి పేరుతో విక్రయం, ఆయిల్ ఇండియా 10శాతం అమ్మకంతో రు. 15000 కోట్లు, హందుస్థాన్ కాపర్లో 9.59శాతం, నాల్కోలో 12.15శాతం, ఎంఎంటిసిలో 9.33శాతం అమ్మకం చేయడానికి 2013`14లో రు.30వేల కోట్ల వాటాల విక్రయానికి నిర్ణయించారు. ఎన్టిపిసి (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్), నాల్కో (నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్) , ఎంఎన్టీసి (మహా నిగమ్ టెలీ కమ్యూనికేషన్), సెయిల్ ఇంజనీర్స్ ఇండియా (స్టీల్ అథారిటీ) కంపెనీలలో 2013 నాటికే వాటాలు ఉపసంహరించాలని, అలాగే రాష్ట్రీయ కెమికల్ రిఫైనరీస్ కూడా అమ్మకానికి పెట్టారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ నవరత్న కంపెనీల్లోని వాటాలను అమ్మి, బహుళజాతి సంస్థలకు లాభాలు చేకేర్చిపెట్టడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.
2014`15 కేంద్ర బడ్జెట్ :
2014`15కు రు. 17,63,214 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను 2014 ఫిబ్రవరి 20న ప్రవేశపెట్టింది. అందులో రు.5,55,322 కోట్లను ప్రణాళికా బడ్జెట్గా చూపింది. ఇందులో పన్నులు రు.11,67,131 కోట్లు కాగా, అప్పులపై చెల్లిస్తున్న వడ్డీలు 4,27,001 కోట్లుగా ఉన్నది. 2013`14లో రివైజ్డ్ అంచనాల ప్రకారం పన్నులు రు.10,29,252 కోట్లు కాగా, అప్పులపై చెల్లించడానికి కేటాయించిన వడ్డీలు 3,80,066 కోట్లుగా ఉన్నది. మన ఆదాయ వ్యయాల్లో ప్రజలపై భారాలు వేసి వడ్డీలు చెల్లించడానికే సరిపోతున్నది. అంతేకాక ప్రణాళికా బడ్జెట్ ప్రణాళికేతర బడ్జెట్లో సగానికి తగ్గింది. సంక్షేమ పథకాలకు కేటాయింపులే తప్పా, నిధుల విడుదల లేదు. ఆహార భద్రతా చట్టానికి అదనంగా 25వేల కోట్లు కావాలని కోరారు. ఆహార భద్రత క్రింద రు.1,15,948.99 కోట్లు కేటాయింపు చూపారు. ఇందులో పెద్దమొత్తం నిధుల దుర్వినియోగం కావడమే తప్ప, అర్హతగల ప్రజలకు అందడం లేదు. ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడానికి భిన్నంగా దారిద్య్ర రేఖకు దిగువనున్నవారికి మాత్రమే ఆహార భద్రత కల్పిస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రు.28, పట్టణ ప్రాంతాల్లో రు.36లు రోజువారీ ఆదాయం మించినవారిని దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నట్లు ప్రకటిస్తామన్నారు. ఈ బడ్జెట్లో సంక్షేమ పథకాలకు సబ్సిడీ లేకుండా రు. 2,55,708 కోట్లు మాత్రమే కేటాయించారు. గత సంవత్సరంపై 208 కోట్లు మాత్రమే పెంచడం జరిగింది. శాస్త్ర`సాంకేతిక అభివృద్దికి 8,643,36 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ రోజు భారత ప్రభుత్వం రాష్ట్ర సాంకేతిక సలహాలను, నూతన ఆవిష్కరణలను ధనిక దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నది.
విద్యారంగానికి కేటాయింపులు పరిశీలిస్తే ప్రాథమిక విద్యకు రు.54,485.10కోట్లు, ఉన్నత విద్యకు రు.26,956 కోట్లు మాత్రమే కేటాయించారు. 1947లో మొదటి ప్రభుత్వం రానున్న 10 సంవత్సరాల్లో నిరక్షరాస్యతను నిర్మూలిస్తామని ప్రకటించింది. కానీ, ఆరు దశాబ్ధాలు పూర్తయినా నేటికీ భారతదేశ స్థాయిలో విద్య కేటాయింపులు తగ్గడంతో 74.04శాతం మాత్రమే అక్షరాస్యత ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో 67.66 శాతం మాత్రమే ఉన్నది. భారత సగటుకు 10శాతం తక్కువగా ఉన్నది.
1961`2011 గణాంకాల ప్రకారం అక్షరాస్యత శాతాలు ఈ విధంగా ఉన్నాయి.
సం॥రం భారత్ ఆంధ్రప్రదేశ్
1961 28.3 21.19
1971 34.45 24.57
1981 43.57 29.94
1991 52.21 44.09
2001 64.83 60.47
2011 74.04 67.066
విద్యాభివృద్దికి కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశ్యపూర్వకంగానే నిధుల కొరతను సృష్టించి నిరక్షరాస్యతను పెంచి పోషిస్తున్నారు. పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలో నిరుద్యోగం అనివార్యం. ఆ అనివార్యతను కొనసాగించడానికే ఆరు దశబ్ధాలు గడిచినా దేశం పూర్తి అక్షరాస్యతను సాధించలేకపోతుంది. 5వ తరగతిలోనూ, 10వ తరగతిలోనూ డ్రాపౌట్స్ ఎక్కువగా ఉంటున్నది. వివిధ దేశాల్లో విద్యారంగానికి కేటాయింపులు ఈ విధంగా ఉంటున్నాయి.
కెన్యా 21.90శాతం
ఘనా 20.10శాతం
శ్రీలంకా 13
మయన్మార్ 15
ఇటియోపియా 14.4
మలావి 15.8
భారత్ 2.3
పై కేటాయింపులు గమనిస్తే విద్యారంగంపై ప్రభుత్వానికి ఉన్న లక్ష్యశుద్ది కనపడుతుంది.
రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పరిస్థితి:
12 రాష్ట్రాలలో కాంగ్రెస్, 5 రాష్ట్రాలలో బిజెపి, మిగిలిన 11 రాష్ట్రాలలో వివిధ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్(మార్చి 1, 2014), ఢల్లీిలలో (ఫిబ్రవరి 2014) రాష్ట్రపతిపాలన కొనసాగుతున్నది. పుదుచ్చెరిలో ఎన్.ఆర్.కాంగ్రెస్ అధికారంలో ఉంది. రానున్న ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ నుండి రాహుల్గాంధీ, బిజెపి నుండి మోడి అప్పుడే ప్రచారం ప్రారంభించారు. వీటికి ప్రత్యామ్నాయంగా 11 పార్టీలతో సిపిఐ(ఎం) పార్టీ చొరవతో మూడవ ఫ్రంట్ ఏర్పాట్లు సాగుతున్నాయి. మూడవ ఫ్రంటుపై బిజెపి తన దాడులు ఎక్కుపెట్టింది. మూడవ ఫ్రంటు రంగంలో ఉంటే తన గెలుపుకు ఆటంకమని భావిస్తున్నది.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు
1) ఆంధ్రప్రదేశ్ : 2009లో ఎన్నికలు జరిగాయి.
2) అరుణాచల్ ప్రదేశ్ : 2009 నవంబర్` నంబంతుకీ
3) అసోం : 2011 ` తరుణ్గోగాయ్
4) హర్యానా : 2009 ` భూపేందర్సింగ్
5) హిమాచల్ ప్రదేశ్ : 2012 ` వీరభద్రాసింగ్
6) కేరళ : యుడిఎఫ్తో 2011` పోలాంచాందీ
7) మహారాష్ట్ర : ఎన్సిపితో ` పృద్వీరాజ్ఛవాన్
8) మణిపూర్ : 2012 ` వోక్రాం ఇబోబీసింగ్
9) మేఘాలయ :2013 ` ముకుల్సంగ్మా
10) మిజోరాం : 2008 ` హులతాన్ హవ్లా
11) ఉత్తరఖండ్ : 2012 ` విజయ్ బహుగుణ
12) కర్నాటక : 2013 ` సిద్ధిరామయ్య సిఎం
బిజెపి పాలిత రాష్ట్రాలు
1) చత్తీస్ఘడ్ : 2013 ` రమణిసింగ్
2) గోవా : 2012 ` మనోహర్ పారికార్
3) గుజరాత్ : 2012 ` నరేంద్రమోడి
4) మధ్యప్రదేశ్ : 2013 నవంబర్ ` శివరాజ్సింగ్ చౌహాన్
5) రాజస్థాన్ : 2013 నవంబర్ ` మహారాణి సిందియా
ఇతర పార్టీల పాలిత రాష్ట్రాలు
1) త్రిపుర : సిపిఎం 2013 ` మానిక్సర్కార్
2) తమిళనాడు : ఎఐడిఎంకె 2011మే ` జయలలిత
3) నాగాలాండ్ : నాగాఫ్రంట్ 2013 ` నైపూర్రియో
4) బిహార్ : జెడి(యు) ` 2011 ` నితిష్
5) జమ్మూ Ê కాశ్మీర్ : జెకె నేషనల్ కాన్ఫరేన్స్ ` 2009 ` ఓమర్ అబ్దుల్లా
6) పంజాబ్ : అకాళీదల్, బాదల్ `2007 ` ప్రకాశ్సింగ్ బాదల్
7) యుపి : ఎస్.పి ` 2013 ` అఖిలేష్ యాదవ్
8) వెస్ట్ బెంగాల్ : టిఎంసి ` 2011 ` మమత
9) సిక్కిం : సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ` 2009 ` పవన్కుమార్ చామ్లిన్
10) ఒరిస్సా : బిజూ జనతాదళ్ ` 2000 ` నవీన్ పట్నాయక్
11) రaార్ఖండ్ : ఘార్ఖండ్ ముక్తిమోర్చా 2013` హేమంత్ సోరెన్
కేంద్రపాలిత ప్రాంతాలు
1) పుదుచ్చెరి : ఎన్.ఆర్.కాంగ్రెస్ 2011
2) చండిఘడ్
3) అండమాన్ నికోబార్
4) దాద్రా & నగర్ హవేలి
5) డామన్ & డయ్యూ
6) లక్షదీప్
7) డిల్లీ : 2013నవంబర్ `(ఆఫ్) కేజ్రీవాల్`2014 ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన.
ఆంధ్రప్రదేశ్ విభజన చివరి అంకం కొనసాగుతున్నది. ఫిబ్రవరి 18 మరియు 21తేదీల్లో లోక్సభ, రాజ్యసభల్లో రాష్ట్ర విభజన బిల్లు మూజివాణి వోటుతో ఆమోదించబడిరది. రాష్ట్రపతి ఆమోదముద్ర 1 మార్చి 2014న పడిరది. బిల్లును గెజెట్లో ప్రకటించారు. రాష్ట్రాల అవతరణకు ‘‘ఆపాయింటెడ్’’తేదీని ప్రకటించాల్సి ఉంది. ఈ బిల్లుకు అదనంగా 1. ఉత్తర తెలంగాణ, రాయలసమీలకు ప్రత్యేక ప్రతిపత్తి హోదా, పోలవరం ముంపు గ్రామాలను తూర్పుగోదావరిజిల్లాకు మార్చడానికి ఆర్డినెన్స్లు తెస్తానని కేంద్రం చెబుతున్నది. దీంతో విభజన చట్టబద్దత పొందింది. విభజనకు కేంద్ర ప్రభుత్వం ఉప సంఘాలను రాష్ట్ర స్థాయిలో నియమించింది. ఆస్తులు మరియు అప్పుల పంపిణీతోపాటు, సిబ్బంది పంపిణీకి ఉప సంఘాలు కృషి ప్రారంభించాయి. అపాయింటెడ్ తేదీతో విభజన ప్రక్రియ ముగిస్తుంది. కానీ ఒకటి రెండు సంవత్సరాలపాటు విభజన అంశాల పంపిణీ కొనసాగుతూనే ఉంటుంది. ఆ విధంగా రాష్ట్ర విభజన ముగిసింది. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వల్ల ఎలాంటి ప్రజా సమస్యలు పరిష్కారం కావిడం లేదు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి రాజీనామాతో రాష్ట్రంలో 1 మార్చి 2014 నుండి రాష్ట్రపతి పాలనను విధించింది.
ప్రస్తుతం రానున్న ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపి కూటములు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నవి. వీటికి దీటుగా మూడవ ఫ్రంటును సిపిఐ(ఎం) పార్టీ 11 లౌకిక పార్టీలతో కలిసి ఏర్పాటు చేసింది. మరిన్ని లౌకిక పార్టీలు మూడవ ఫ్రంటులోకి వచ్చే అవకాశం ఉంది. మూడవ ఫ్రంటు ముందు కనీస కార్యక్రమాన్ని ప్రతిపాదించారు.
ఈ ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రచార నినాదాలుగా రూపొందించి, కాంగ్రెస్`బిజేపీలను ఓడిరచడానికి కృషి సాగిస్తున్నది.
ప్రత్యామ్నాయ కార్యక్రమం:
1) భూ సంస్కరణల అమలు, మిగులు భూముల పంపిణీ. పేదలందరికీ నివాస స్థలాల ఏర్పాటు. బలవంతపు భూ సేకరణ రద్దు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు రైతులకు గిట్టుబాటు ధరలు, తక్కువ వడ్డీ రుణాలు.
2) ఉపాధి కల్పనే లక్ష్యంగా వస్తు తయారీ, మౌలిక వసతుల రంగాల్లో భారీగా ప్రభుత్వ పెట్టుబడులు. మైనింగ్, చమురు రంగాల జాతీయీకరణ.
3) పకడ్బంధీగా పన్నుల వసూలు, పన్ను ఎగవేత మార్గాల నివారణ. స్పెక్కులేటీవ్ ద్రవ్య పెట్టుబడుల నియంత్రణ. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల రద్దు.
4) ప్రతి కుటుంబానికి కిలో రెండు రూపాయల గరిష్ట ధరకు 35 కేజీల ఆహార ధాన్యాలను అందించేలా సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు. ఆ మేరకు ఆహార భద్రతా చట్టం రూపకల్పన.
5) రాజ్యాంగాన్ని, మతాన్ని విడివిడిగా ఉంచడమే లౌకికవాదం మౌలిక సూత్రంగా రాజ్యంగంలో మార్పులు, మతోన్మాద శక్తులను అరికట్టేందుకు కఠిన చర్యలు.
6) విద్య, ఆరోగ్య రంగాలకు భారీగా బడ్జెటరీ కేటాయింపులు. విద్య, ఆరోగ్య రంగాల ప్రయివేటీకరణ నిలుపుదల. విద్యా హక్కు చట్టం అమలును తప్పనిసరి చేస్తూ చర్యలు.
7) ఉన్నత స్థాయిల్లో అవినీతిని అరికట్టేందుకు కఠిన చర్యలు స్వతంత్య్ర దర్యాప్తు అధికారంలో లోక్పాల్ చట్టం.
8) అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు. పార్లమెంట్, చట్టసల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు దళిత హక్కుల రక్షణ. ప్రయివేటు రంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, మైనార్టీలకు రిజర్వేషన్ల కల్పించేందుకు రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సుల అమలు. ఆదివాసీల ఐదు, ఆరో షెడ్యూల్ హక్కుల పరిరక్షణ.
9) కార్మిక హక్కుల పరిరక్షణ. కనీస వేతనాలు, సామాజిక భద్రతా చర్యల అమలు, కాంట్రాక్ట్`క్యాజువల్ కార్మిక విధానం రద్దు.
10) స్వాతంత్ర విదేశాంగ విధానం అమలు.
28.02.2014
సారంపల్లి మల్లారెడ్డి
Sarampally Mallareddy
2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని జనవరి 3న ఢల్లీిలో ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించారు. గత పదేళ్ళల్లో ప్రధాని అధికారికంగా నిర్వహించిన మూడవ విలేకరుల సమావేశం ఇది. ‘‘వచ్చే ఎన్నికల్లో తాను ప్రధాని అభ్యర్థిని కాదని, యుపిఏ`3లో కొత్త ప్రధాని బాధ్యతలు చేపడతారని, రాహుల్గాంధీ ప్రధాని పదవికి అర్హుడని, గ్రామీణ ఉపాధిహామీపథకం` లోక్పాల్బిల్లు` సమాచారహక్కు చట్టం కంటే అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందమే తనకు అత్యంత ఆనందకరమైనదని, పాలనలో అక్రమాలు జరిగినమాట నిజమేనని, నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయలేకపోయామని, మిగిలిన ఐదు నెలల కాలంలో సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెల్తామని మన్మోహన్ ప్రకటించారు.
2014 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉంటే రాహుల్ను ప్రధానిగా ముందుకు తెచ్చే విధంగా పార్టీ వ్యూహరచన చేసింది. ఎన్నికల అనంతరమే ప్రధానిని ప్రకటిస్తామని, రాహుల్కు ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పజెప్పుతున్నట్లు జనవరి 16న జరిగిన సిడబ్ల్యుసీలో నిర్ణయం తీసుకున్నారు.
దేశంలో నిరుద్యోగానికి, దారిద్య్ర పెరుగుదలకు 14.9.2012న ఎఫ్డిఐ రాకపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం చేసింది. ఎఫ్డిఐ ప్రవేశాన్ని రాష్ట్రాలే నిర్ణయించుకోవాలి. కేంద్రంపై ఆందోళనలు రాకుండా ఈ పరిమితి పెట్టారు.
10 లక్షల జనాభా కలిగిన 51 పట్టణాలలోని చిల్లర దుకాణాలకే ఇది పరిమితం చేసారు. చిల్లర దుకాణాల్లోకి 30శాతం దేశీయ ఉత్పత్తుల సమీకరణ చేయాలి. మిగిలిన 70శాతం విదేశీ దిగుమతుల ద్వారా సేకరించాలి. అనగా విదేశీ దిగుమతులకు ప్రోత్సాహం కల్పించడానికి ఎఫ్డిఐ (ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్) ద్వారా దేశీయ చిల్లర దుకాణాలదారులను కోట్ల సంఖ్యలు నిరుద్యోగులు చేయతలపెట్టారు.
బహుళబ్రాండ్ల రిటేయిల్ వర్తకంలో 51శాతం, బ్రాడ్కాస్టింగ్లో 74శాతం, విమానయాన రంగంలో 49శాతం, ప్రభుత్వ కంపెనీల విక్రయం, విద్యుత్ పవర్ ట్రేడిరగ్ ఎక్స్చేంజీలలో 49శాతం పెంచారు. అంతకు ముందు సింగిల్ బ్రాండ్లో 51శాతం ఉండగా దానిని 100శాతానికి పెంచారు. 25 మహా, నవరత్న కంపెనీల నిల్వలను కేంద్ర ప్రభుత్వానికి జమచేయాలని ప్రధాని ఆదేశం. దేశ బడ్జెట్కు లోటును పూడ్చుకోవడానికి లాభాల్లో ఉన్న ప్రభుత్వ కంపెనీలలోని నిల్వను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి కేంద్రం కుట్రలు కొనసాగిస్తున్నది. పైగా ప్రభుత్వ కంపెనీల విక్రయాన్ని ‘‘వాటాల ఉపసంహరణ’’ పేరుతో నిధులు సేకరిస్తున్నారు.
నాలుగు ప్రభుత్వ కంపెనీల విక్రయం :
ప్రభుత్వ రంగంలోని నాలుగు సంస్థలను ఎఫ్డిఐల అనుమతి పేరుతో విక్రయం, ఆయిల్ ఇండియా 10శాతం అమ్మకంతో రు. 15000 కోట్లు, హందుస్థాన్ కాపర్లో 9.59శాతం, నాల్కోలో 12.15శాతం, ఎంఎంటిసిలో 9.33శాతం అమ్మకం చేయడానికి 2013`14లో రు.30వేల కోట్ల వాటాల విక్రయానికి నిర్ణయించారు. ఎన్టిపిసి (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్), నాల్కో (నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్) , ఎంఎన్టీసి (మహా నిగమ్ టెలీ కమ్యూనికేషన్), సెయిల్ ఇంజనీర్స్ ఇండియా (స్టీల్ అథారిటీ) కంపెనీలలో 2013 నాటికే వాటాలు ఉపసంహరించాలని, అలాగే రాష్ట్రీయ కెమికల్ రిఫైనరీస్ కూడా అమ్మకానికి పెట్టారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ నవరత్న కంపెనీల్లోని వాటాలను అమ్మి, బహుళజాతి సంస్థలకు లాభాలు చేకేర్చిపెట్టడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.
2014`15 కేంద్ర బడ్జెట్ :
2014`15కు రు. 17,63,214 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను 2014 ఫిబ్రవరి 20న ప్రవేశపెట్టింది. అందులో రు.5,55,322 కోట్లను ప్రణాళికా బడ్జెట్గా చూపింది. ఇందులో పన్నులు రు.11,67,131 కోట్లు కాగా, అప్పులపై చెల్లిస్తున్న వడ్డీలు 4,27,001 కోట్లుగా ఉన్నది. 2013`14లో రివైజ్డ్ అంచనాల ప్రకారం పన్నులు రు.10,29,252 కోట్లు కాగా, అప్పులపై చెల్లించడానికి కేటాయించిన వడ్డీలు 3,80,066 కోట్లుగా ఉన్నది. మన ఆదాయ వ్యయాల్లో ప్రజలపై భారాలు వేసి వడ్డీలు చెల్లించడానికే సరిపోతున్నది. అంతేకాక ప్రణాళికా బడ్జెట్ ప్రణాళికేతర బడ్జెట్లో సగానికి తగ్గింది. సంక్షేమ పథకాలకు కేటాయింపులే తప్పా, నిధుల విడుదల లేదు. ఆహార భద్రతా చట్టానికి అదనంగా 25వేల కోట్లు కావాలని కోరారు. ఆహార భద్రత క్రింద రు.1,15,948.99 కోట్లు కేటాయింపు చూపారు. ఇందులో పెద్దమొత్తం నిధుల దుర్వినియోగం కావడమే తప్ప, అర్హతగల ప్రజలకు అందడం లేదు. ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడానికి భిన్నంగా దారిద్య్ర రేఖకు దిగువనున్నవారికి మాత్రమే ఆహార భద్రత కల్పిస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రు.28, పట్టణ ప్రాంతాల్లో రు.36లు రోజువారీ ఆదాయం మించినవారిని దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నట్లు ప్రకటిస్తామన్నారు. ఈ బడ్జెట్లో సంక్షేమ పథకాలకు సబ్సిడీ లేకుండా రు. 2,55,708 కోట్లు మాత్రమే కేటాయించారు. గత సంవత్సరంపై 208 కోట్లు మాత్రమే పెంచడం జరిగింది. శాస్త్ర`సాంకేతిక అభివృద్దికి 8,643,36 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ రోజు భారత ప్రభుత్వం రాష్ట్ర సాంకేతిక సలహాలను, నూతన ఆవిష్కరణలను ధనిక దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నది.
విద్యారంగానికి కేటాయింపులు పరిశీలిస్తే ప్రాథమిక విద్యకు రు.54,485.10కోట్లు, ఉన్నత విద్యకు రు.26,956 కోట్లు మాత్రమే కేటాయించారు. 1947లో మొదటి ప్రభుత్వం రానున్న 10 సంవత్సరాల్లో నిరక్షరాస్యతను నిర్మూలిస్తామని ప్రకటించింది. కానీ, ఆరు దశాబ్ధాలు పూర్తయినా నేటికీ భారతదేశ స్థాయిలో విద్య కేటాయింపులు తగ్గడంతో 74.04శాతం మాత్రమే అక్షరాస్యత ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో 67.66 శాతం మాత్రమే ఉన్నది. భారత సగటుకు 10శాతం తక్కువగా ఉన్నది.
1961`2011 గణాంకాల ప్రకారం అక్షరాస్యత శాతాలు ఈ విధంగా ఉన్నాయి.
సం॥రం భారత్ ఆంధ్రప్రదేశ్
1961 28.3 21.19
1971 34.45 24.57
1981 43.57 29.94
1991 52.21 44.09
2001 64.83 60.47
2011 74.04 67.066
విద్యాభివృద్దికి కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశ్యపూర్వకంగానే నిధుల కొరతను సృష్టించి నిరక్షరాస్యతను పెంచి పోషిస్తున్నారు. పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలో నిరుద్యోగం అనివార్యం. ఆ అనివార్యతను కొనసాగించడానికే ఆరు దశబ్ధాలు గడిచినా దేశం పూర్తి అక్షరాస్యతను సాధించలేకపోతుంది. 5వ తరగతిలోనూ, 10వ తరగతిలోనూ డ్రాపౌట్స్ ఎక్కువగా ఉంటున్నది. వివిధ దేశాల్లో విద్యారంగానికి కేటాయింపులు ఈ విధంగా ఉంటున్నాయి.
కెన్యా 21.90శాతం
ఘనా 20.10శాతం
శ్రీలంకా 13
మయన్మార్ 15
ఇటియోపియా 14.4
మలావి 15.8
భారత్ 2.3
పై కేటాయింపులు గమనిస్తే విద్యారంగంపై ప్రభుత్వానికి ఉన్న లక్ష్యశుద్ది కనపడుతుంది.
రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పరిస్థితి:
12 రాష్ట్రాలలో కాంగ్రెస్, 5 రాష్ట్రాలలో బిజెపి, మిగిలిన 11 రాష్ట్రాలలో వివిధ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్(మార్చి 1, 2014), ఢల్లీిలలో (ఫిబ్రవరి 2014) రాష్ట్రపతిపాలన కొనసాగుతున్నది. పుదుచ్చెరిలో ఎన్.ఆర్.కాంగ్రెస్ అధికారంలో ఉంది. రానున్న ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ నుండి రాహుల్గాంధీ, బిజెపి నుండి మోడి అప్పుడే ప్రచారం ప్రారంభించారు. వీటికి ప్రత్యామ్నాయంగా 11 పార్టీలతో సిపిఐ(ఎం) పార్టీ చొరవతో మూడవ ఫ్రంట్ ఏర్పాట్లు సాగుతున్నాయి. మూడవ ఫ్రంటుపై బిజెపి తన దాడులు ఎక్కుపెట్టింది. మూడవ ఫ్రంటు రంగంలో ఉంటే తన గెలుపుకు ఆటంకమని భావిస్తున్నది.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు
1) ఆంధ్రప్రదేశ్ : 2009లో ఎన్నికలు జరిగాయి.
2) అరుణాచల్ ప్రదేశ్ : 2009 నవంబర్` నంబంతుకీ
3) అసోం : 2011 ` తరుణ్గోగాయ్
4) హర్యానా : 2009 ` భూపేందర్సింగ్
5) హిమాచల్ ప్రదేశ్ : 2012 ` వీరభద్రాసింగ్
6) కేరళ : యుడిఎఫ్తో 2011` పోలాంచాందీ
7) మహారాష్ట్ర : ఎన్సిపితో ` పృద్వీరాజ్ఛవాన్
8) మణిపూర్ : 2012 ` వోక్రాం ఇబోబీసింగ్
9) మేఘాలయ :2013 ` ముకుల్సంగ్మా
10) మిజోరాం : 2008 ` హులతాన్ హవ్లా
11) ఉత్తరఖండ్ : 2012 ` విజయ్ బహుగుణ
12) కర్నాటక : 2013 ` సిద్ధిరామయ్య సిఎం
బిజెపి పాలిత రాష్ట్రాలు
1) చత్తీస్ఘడ్ : 2013 ` రమణిసింగ్
2) గోవా : 2012 ` మనోహర్ పారికార్
3) గుజరాత్ : 2012 ` నరేంద్రమోడి
4) మధ్యప్రదేశ్ : 2013 నవంబర్ ` శివరాజ్సింగ్ చౌహాన్
5) రాజస్థాన్ : 2013 నవంబర్ ` మహారాణి సిందియా
ఇతర పార్టీల పాలిత రాష్ట్రాలు
1) త్రిపుర : సిపిఎం 2013 ` మానిక్సర్కార్
2) తమిళనాడు : ఎఐడిఎంకె 2011మే ` జయలలిత
3) నాగాలాండ్ : నాగాఫ్రంట్ 2013 ` నైపూర్రియో
4) బిహార్ : జెడి(యు) ` 2011 ` నితిష్
5) జమ్మూ Ê కాశ్మీర్ : జెకె నేషనల్ కాన్ఫరేన్స్ ` 2009 ` ఓమర్ అబ్దుల్లా
6) పంజాబ్ : అకాళీదల్, బాదల్ `2007 ` ప్రకాశ్సింగ్ బాదల్
7) యుపి : ఎస్.పి ` 2013 ` అఖిలేష్ యాదవ్
8) వెస్ట్ బెంగాల్ : టిఎంసి ` 2011 ` మమత
9) సిక్కిం : సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ` 2009 ` పవన్కుమార్ చామ్లిన్
10) ఒరిస్సా : బిజూ జనతాదళ్ ` 2000 ` నవీన్ పట్నాయక్
11) రaార్ఖండ్ : ఘార్ఖండ్ ముక్తిమోర్చా 2013` హేమంత్ సోరెన్
కేంద్రపాలిత ప్రాంతాలు
1) పుదుచ్చెరి : ఎన్.ఆర్.కాంగ్రెస్ 2011
2) చండిఘడ్
3) అండమాన్ నికోబార్
4) దాద్రా & నగర్ హవేలి
5) డామన్ & డయ్యూ
6) లక్షదీప్
7) డిల్లీ : 2013నవంబర్ `(ఆఫ్) కేజ్రీవాల్`2014 ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన.
ఆంధ్రప్రదేశ్ విభజన చివరి అంకం కొనసాగుతున్నది. ఫిబ్రవరి 18 మరియు 21తేదీల్లో లోక్సభ, రాజ్యసభల్లో రాష్ట్ర విభజన బిల్లు మూజివాణి వోటుతో ఆమోదించబడిరది. రాష్ట్రపతి ఆమోదముద్ర 1 మార్చి 2014న పడిరది. బిల్లును గెజెట్లో ప్రకటించారు. రాష్ట్రాల అవతరణకు ‘‘ఆపాయింటెడ్’’తేదీని ప్రకటించాల్సి ఉంది. ఈ బిల్లుకు అదనంగా 1. ఉత్తర తెలంగాణ, రాయలసమీలకు ప్రత్యేక ప్రతిపత్తి హోదా, పోలవరం ముంపు గ్రామాలను తూర్పుగోదావరిజిల్లాకు మార్చడానికి ఆర్డినెన్స్లు తెస్తానని కేంద్రం చెబుతున్నది. దీంతో విభజన చట్టబద్దత పొందింది. విభజనకు కేంద్ర ప్రభుత్వం ఉప సంఘాలను రాష్ట్ర స్థాయిలో నియమించింది. ఆస్తులు మరియు అప్పుల పంపిణీతోపాటు, సిబ్బంది పంపిణీకి ఉప సంఘాలు కృషి ప్రారంభించాయి. అపాయింటెడ్ తేదీతో విభజన ప్రక్రియ ముగిస్తుంది. కానీ ఒకటి రెండు సంవత్సరాలపాటు విభజన అంశాల పంపిణీ కొనసాగుతూనే ఉంటుంది. ఆ విధంగా రాష్ట్ర విభజన ముగిసింది. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వల్ల ఎలాంటి ప్రజా సమస్యలు పరిష్కారం కావిడం లేదు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి రాజీనామాతో రాష్ట్రంలో 1 మార్చి 2014 నుండి రాష్ట్రపతి పాలనను విధించింది.
ప్రస్తుతం రానున్న ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపి కూటములు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నవి. వీటికి దీటుగా మూడవ ఫ్రంటును సిపిఐ(ఎం) పార్టీ 11 లౌకిక పార్టీలతో కలిసి ఏర్పాటు చేసింది. మరిన్ని లౌకిక పార్టీలు మూడవ ఫ్రంటులోకి వచ్చే అవకాశం ఉంది. మూడవ ఫ్రంటు ముందు కనీస కార్యక్రమాన్ని ప్రతిపాదించారు.
ఈ ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రచార నినాదాలుగా రూపొందించి, కాంగ్రెస్`బిజేపీలను ఓడిరచడానికి కృషి సాగిస్తున్నది.
ప్రత్యామ్నాయ కార్యక్రమం:
1) భూ సంస్కరణల అమలు, మిగులు భూముల పంపిణీ. పేదలందరికీ నివాస స్థలాల ఏర్పాటు. బలవంతపు భూ సేకరణ రద్దు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు రైతులకు గిట్టుబాటు ధరలు, తక్కువ వడ్డీ రుణాలు.
2) ఉపాధి కల్పనే లక్ష్యంగా వస్తు తయారీ, మౌలిక వసతుల రంగాల్లో భారీగా ప్రభుత్వ పెట్టుబడులు. మైనింగ్, చమురు రంగాల జాతీయీకరణ.
3) పకడ్బంధీగా పన్నుల వసూలు, పన్ను ఎగవేత మార్గాల నివారణ. స్పెక్కులేటీవ్ ద్రవ్య పెట్టుబడుల నియంత్రణ. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల రద్దు.
4) ప్రతి కుటుంబానికి కిలో రెండు రూపాయల గరిష్ట ధరకు 35 కేజీల ఆహార ధాన్యాలను అందించేలా సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు. ఆ మేరకు ఆహార భద్రతా చట్టం రూపకల్పన.
5) రాజ్యాంగాన్ని, మతాన్ని విడివిడిగా ఉంచడమే లౌకికవాదం మౌలిక సూత్రంగా రాజ్యంగంలో మార్పులు, మతోన్మాద శక్తులను అరికట్టేందుకు కఠిన చర్యలు.
6) విద్య, ఆరోగ్య రంగాలకు భారీగా బడ్జెటరీ కేటాయింపులు. విద్య, ఆరోగ్య రంగాల ప్రయివేటీకరణ నిలుపుదల. విద్యా హక్కు చట్టం అమలును తప్పనిసరి చేస్తూ చర్యలు.
7) ఉన్నత స్థాయిల్లో అవినీతిని అరికట్టేందుకు కఠిన చర్యలు స్వతంత్య్ర దర్యాప్తు అధికారంలో లోక్పాల్ చట్టం.
8) అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు. పార్లమెంట్, చట్టసల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు దళిత హక్కుల రక్షణ. ప్రయివేటు రంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, మైనార్టీలకు రిజర్వేషన్ల కల్పించేందుకు రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సుల అమలు. ఆదివాసీల ఐదు, ఆరో షెడ్యూల్ హక్కుల పరిరక్షణ.
9) కార్మిక హక్కుల పరిరక్షణ. కనీస వేతనాలు, సామాజిక భద్రతా చర్యల అమలు, కాంట్రాక్ట్`క్యాజువల్ కార్మిక విధానం రద్దు.
10) స్వాతంత్ర విదేశాంగ విధానం అమలు.
28.02.2014
సారంపల్లి మల్లారెడ్డి
Sarampally Mallareddy
ఆరుదశాబ్దాలు గడిచినా త్రాగునీరు నోచని ప్రజలు
2010`11 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రు.9000 కోట్లు ‘‘జాతీయ గ్రామీణ అభివృద్ధి త్రాగునీటి పథకం’’ కింద కేటాయించి దేశంలోని అన్ని గ్రామాలకు రక్షత త్రాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామీణాభివృధ్ధిశాఖ పథకం రూపొందించింది. ముఖ్యంగా దళిత, గిరిజన పల్లెలకు, మురికా వాడలకు త్రాగునీటి సౌకర్యం కల్పించడానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ నిధులలో 20శాతం రాష్ట్రాలకు కేటాయిస్తూ, రాష్ట్రాలు వారి పథకాలకు 50:50 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని కోరింది. ఇప్పటికే అనేక గ్రామాలకు త్రాగునీటి సౌకర్యంలేదు. ప్రజలు 10`12 కి.మీ వెళ్ళి త్రాగునీరు తెస్తున్నారు. ఒక వ్యక్తికి రోజుకు 40 లీటర్ల నీరు అవసరం. కానీ 10లీటర్ల లోపు లభ్యత లేని గ్రామాలు ఆంధ్రప్రదేశ్లోనే 1500 వరకు ఉన్నాయి. ఆరు దశాబ్దాలు గడిచినా మన ప్రభుత్వాలు త్రాగునీటి సమస్యను పరిష్కరించలేకపోయాయి. భూగోళంపైనున్న ప్రతి ప్రాణికి నీరు అవసరం. నీటి లభ్యత తగినంత ఉంది. కానీ ప్రభుత్వాలు వినియోగంలోకి తేకపోవడంతో అనేక మంది అనారోగ్యానికి గురై చనిపోతున్నారు. ఈ పరిస్థితులు గమనించి 1.3.92న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం మార్చి 23ను త్రాగునీటి దినంగా పిలుపిచ్చింది. ప్రపంచంలో మొదటిసారి 22మార్చి 1993న ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచంలో 78.3 కోట్ల మందికి రక్షిత నీరు లేదు. 7 లక్షల మంది పిల్లలు కులుషిత నీరు త్రాగి డయోరియాతో యేటా మరణిస్తున్నారు. అనగా రోజుకు 2000 మంది పిల్లలు మరణిస్తున్నారు. దీనిని నివారించడానికి ఐక్యరాజ్య సమితి ఉద్యమం చేపట్టింది. అనేక ధనిక దేశాలు పేద దేశాలకు గ్రాంట్ల రూపంలో త్రాగునీటి పరిష్కారానికి నిధులు ఇస్తున్నాయి. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది.
ఆర్శనిక్ మందులు, ఫ్లోరైడ్ నీరు, చౌడు కలిసిన నీరు(సెలినిటి) ఇనుము తదితర ఖనిజ లవణాలు కలిసిన నీరు, నైట్రేట్స్ మరియు బ్యాక్టీరియా కలుషితం జరిగిన నీటిని త్రాగునీటిగా వినియోగిస్తున్నాం. భారత దేశస్థాయిలో 11.51 లక్షల గ్రామాలకు రక్షిత నీరు ఉన్నట్టు, 5.70 లక్షల గ్రామాలకు పాక్షికంగా సరఫరా చేస్తున్నట్టు, 1.44 లక్షల గ్రామాలు కలుషిత నీటిని వినియోగిస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. 85శాతం భూగర్భ జలాలపైననే ఆధారపడి ఉన్నారు. 35శాతం పైపు వాడుతున్నారు. 12శాతం మాత్రమే రక్షిత నీటి ట్యాపులు పని చేస్తున్నాయి. రాష్ట్రంలో భూగర్భ జలాల లభ్యత 34,700 మిలియన్ క్యూబిక్ మీటర్లు లభ్యత ఉండగా, 14,112 మిలియన్ క్యూబిక్ మిటర్లు మాత్రమే వినియోగిస్తున్నాం. అనేక పథకాలు ప్రవేశపెట్టి త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఈ విధంగా వున్నాయి.
1) అత్యవసర గ్రామీణ నీటి సరఫరా పథకం(ఎఆర్డబ్ల్యుఎస్). దీనిని భారత ప్రభుత్వం 1972`73లో ప్రారంభించి 1973`74లో ఉపసంహరించింది. తిరిగి 1977`78లో కొనసాగించింది. 2009`10లో ఈ పథకం పేరు ఎన్ఆర్డిడబ్ల్యుపి (నేషనల్ రూరల్ డెవలప్మెంట్ వాటర్ ప్రాజెక్టు)గా మార్చారు.
2) కనీస అవసర కార్యక్రమం(ఎమ్ఎన్పి). ఐదవ పంచవర్ష ప్రణాళికలో గ్రామీణ త్రాగునీటి సరఫరా కోసం ఈ పథకాన్ని తెచ్చారు. ముఖ్యంగా దళితులు, గిరిజనుల సబ్ప్లాన్ నిధులను వినియోగించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలి.
3) ప్రధానమంత్రి గ్రామోదయ యోజన గ్రామీణ నీటి సరఫరా పథకం(పిఎమ్జివై`ఆర్డబ్ల్యుఎస్పి), దీనిని 2000`01లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామోదయ యోజన కింద ప్రారంభించింది. ఈ పథకానికి ఎమ్ఎన్పి(దళిత, గిరిజన సబ్ప్లాన్) నిధులను కూడా కలిపారు.
4) నాబార్డ్(ఆర్ఐడిఎఫ్), 2000`01 సంవత్సరం నాబార్డ్ ఆర్థిక సహాయంతో గ్రామీణ త్రాగునీటి పథకాలు ప్రారంభించారు. ఇందులో నాబార్డు 85శాతం, రాష్ట్ర ప్రభుత్వం 15శాతం భరించాలి.
5) అంబేద్కర్ జీవనధార(ఎజెడి), ప్రధానంగా దళిత, గిరిజనులు నివసించే ప్రాంతాలకు గ్రామీణ త్రాగునీటి పథకం వర్తింప చేయడానికి దీనిని ఉద్దేశించారు.
6) హడ్కో 2004`05లో (హౌసింగ్ Ê అర్బన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (హడ్కో) నుండి గ్రామీణ త్రాగునీటి పథకాలకు మరియు సమస్యాత్మక గ్రామాలకు త్రాగునీటి సరఫరాకు ఆర్థిక సహాయం చేస్తారు.
7) ఎడారి అభివృద్ధి కార్యక్రమం(డిడిపి), కేంద్ర ప్రభుత్వం 100శాతం సహాయంతో అనంతపూర్ జిల్లాలో ప్రజలకు, పశువులకు త్రాగునీటి సహకారానికి నిధులు కేటాయించాలి.
8) స్వజలధార కార్యక్రమం, 25 డిసెంబర్ 2002న ప్రధాన మంత్రి వాజ్పేయిగారు ఆంధ్రప్రదేశ్, ఆదిలాబాద్ జిల్లా ఆవాల్పూర్ గ్రామంలో త్రాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం మూడు మాసాలు నడవగానే మూతపడిరది. ఇలాంటి పథకాలను మరిన్ని గ్రామాలలో పెట్టడానికి ప్రయత్నించి విఫలం చెందారు. పై కేంద్ర ప్రభుత్వ పథకాలే కాక కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారానూ, ప్రణాళికా నిధుల ద్వారానూ అనేక పథకాలు చేపట్టి అర్ధాంతరంగా నిలిపివేశారు. చివరికి గ్రామాలలో త్రాగునీటి సౌకర్య కల్పనకు పథకాలు రూపొందించారు. అయినా ఇంతవరకూ త్రాగునీటి సమస్య పరిష్కరించబడలేదు.
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి :
రాష్ట్రంలో 8.46 కోట్ల జనాభా (2011) ఉండగా 6.40 కోట్ల మంది గ్రామాలలో నివసిస్తున్నారు. 6 జిల్లాలలో గిరిజనులు అడవి ప్రాంతాలలో నివసిస్తున్నారు. నేటికీ గ్రామిణ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలోనూ నివసించే ప్రజల త్రాగునీటి పరిస్థితి అత్యంత హృదయ విదారకంగా ఉంది. 4`5 కి.మీల నుండి తెచ్చుకున్న నీటిని బహు జాగ్రత్తగా వాడుకోవాలి. మొత్తం గ్రామాలు 72,147 ఉండగా (21,634 గ్రా.పం) రోజుకు తలసరి 40లీటర్లు వినియోగించే గ్రామాలు 36,727 ఉన్నాయి. 10`39లీ. వినియోగించే గ్రామాలు 34,074 ఉన్నాయి. మిగిలినవి 10లీ లోపు వినియోగించే గ్రామాలు. 210 పట్టణాలకు కల్పించిన త్రాగునీటి వనరులు పట్టణ ప్రాంతాలకు కల్పించలేదు. మొత్తం గ్రామాలలో 3,33,123 చేతి పంపులు, 46,451 పిడబ్ల్యుఎస్ స్కీమ్లు, 462 సిపిడబ్ల్యుఎస్ స్కీమ్లు, 51 నీటి పరిక్షా కేంద్రాలు పని చేస్తున్నాయి. కానీ ఇందులో 35శాతం చేతి పంపులు పని చేయడం లేదు. రిపేర్లు చేయడానికి గ్రామపంచాయితీల వద్ద నిధులు లేక గ్రామాలలో త్రాగునీటి కొరత తీవ్రంగా ఉంది. యేటా మార్చి నెల ప్రవేశించినప్పటి నుండి జూలై ఆఖరు వరకు గ్రామాలలో త్రాగునీరు లభ్యత లేదు. జనగామా నియోజకవర్గంలోని పట్టణాలకు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నియోజకవర్గంలోని గ్రామాలకు నీటిని ఫీల్టర్ చేయకుండానే, డీ`ఫ్లోరైడ్ చేయకుండానే సరఫరా చేస్తున్నారు. దీనివల్ల గతంలో ఉన్న ఆరోగ్యం కూడా దెబ్బతిని ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో చెక్డ్యాంలు, ఊటచెరువులు, ఉపరితల కుంటలు, వర్షపు కుంటలు, రీఛార్జ్ కుంటలు, భారీ మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్నప్పటికీ త్రాగునీటి కొరత తీవ్రంగా ఉంది.
1969`2007 వరకు త్రాగునీటికి రాష్ట్రంలో 65.83 కోట్ల వ్యయం జరిగింది. ఈ దిగువ పనులు చేసారు.
(1) హాండ్పంపులు (2) ఎస్విఎస్ (సింగిల్ విలేజ్) స్కీమ్లు (3) ఎంవిఎస్ (బహుళ గ్రామాలు) స్కీమ్లు
ఉపరితల నీటి వినియోగం 23% మరియు భూగర్భజలాలు 72% వినియోగంలోకి తేవడానికి అంచనా వేసారు.
రాష్ట్రంలో మొత్తం గ్రామాలు 72147 ఉండగా 50శాతం గ్రామాలకు కూడా రక్షిత నీరు లేదు. ఆ ప్రయత్నమే లేదు. పథకాలెన్ని ప్రవేశపెట్టినా గ్రామీణ నీటి సరఫరా నేటికీ పూర్తికాలేదు. ఇక పట్టణాల సంగతి సరేసరి. 210 పట్టణాల్లో త్రాగునీటి కన్నా మురుగునీటి పారుదల సమస్యగా ఉంది. సీవరేజ్ బోర్డువారు త్రాగునీరు ` డ్రైనేజీ (సానిటేషన్) రెండు వ్యవస్థలను నిర్వహిస్తున్నారు. రకరకాల పథకాలతో ప్రవేశపెట్టిన త్రాగునీటి పథకాలు, శానిటేషన్ పథకాలు మధ్య దళారీలు కాజేస్తున్నారు. పట్టణాల్లో కాంట్రాక్టర్లే మున్సిపాలిటీలను కార్పొరేషన్ల నిధుల వ్యయంపై పెత్తనం చెలాయిస్తున్నారు. చివరకు త్రాగునీటిని వ్యాపారంగా మార్చివేసారు.
త్రాగునీటి వ్యాపారం :
సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో త్రాగునీటిని వ్యాపార సరుకుగా మార్చివేశారు. బహుళజాతి సంస్థలు ఈ రంగంపై గుత్తాధిపత్యం కలిగి వేల కోట్లు ఆర్జిస్తున్నారు. సోయూజ్ లియోన్నాయిస్, మెక్డోనాల్డ్, కోకోకోలా(కిన్లే) పెప్సి, మోన్శాంటో, థామస్వాటర్, నార్త్వెస్ట్వాటర్, వివిండ్ఎన్విరాన్మెంట్, ఎన్రాన్, కింగ్ఫిషర్ లాంటి సంస్థలు వేల కోట్ల త్రాగునీటి వ్యాపారం సాగిస్తున్నాయి. టాటా కంపెనీతో యురేకా ఫోర్బ్స్ జాయింట్ వెంచర్గా కలిసి నీటి వ్యాపారం సాగిస్తున్నారు. వీరంతా త్రాగునీటి వ్యాపారం చేయడం ఫలితంగా ప్రభుత్వం ఉచితంగా రక్షిత త్రాగునీటిని అందించే పథకాలకు అడ్డుపడుతున్నారు. గ్రామీణ రక్షిత పథకాలను చేపట్టి దశాబ్దాలు గడిచినా పెండిరగులో పెడుతున్నారు. రాష్ట్రంలో ఈ బహుళజాతి సంస్థలు ఏర్పాటు చేసిన 56 మందుల తయారీ కంపెనీలు వదులుతున్న కాలుష్యం త్రాగునీటిలోకి చేరినట్టు పరిశోధనల ద్వారా తెలిసింది. మద్యం తయారీకి వేల కోట్ల లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. 1లీ బీరు తయారు చేయడానికి 10లీ ల నీరు కావాలి. ప్రస్తుతం త్రాగునీరు రు.15`20 ఉండగా లీటరు పాలు గ్రామాలలో రు.15`20 అమ్ముతున్నారు. ప్రస్తుతం నీటి వ్యాపారం ప్రపంచవ్యాపితంగా యేటా 400 కోట్ల డాలర్ల వ్యాపారం సాగుతున్నది. గ్రామాలలో డీ`ఫ్లోరైడేషన్ చిన్న యంత్రాలను పెట్టి ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. వీరు సరఫరా చేసే నీటికన్నా బోరునీరు వినియోగం మంచిదని పరిశీలకులు చెప్తున్నారు. కానీ ఈరోజు ప్రతి కుటుంబం త్రాగునీరు కొనుగోలుపైననే ఆధారపడి వుంటున్నారు.
హైదరాబాదు పట్టణ త్రాగునీటి సమస్య :
హైదరాబాదు నగరంలో సంపన్నుల కాలనీలో ఎలాంటి ఆటంకం లేకుండా అధిక మొత్తంలో నీరు సరఫరా అవుతుండగా పేదలు నివసించే బస్తీలలో సరఫరా తక్కువగా ఉంటుంది. సంపన్న కాలనీవాసులు సరఫరా అవుతున్న నీటిని వాహనాలు కడగడానికి, చెట్లకు పెట్టడం, స్విమ్మింగ్ఫూల్స్, పెంపుడు జంతువులకు స్నానం చేయించడం లాంటి వాటికి వినియోగిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాదు పట్టణానికి ఈ దిగువ విధంగా రోజుకు మిలియన్గాలన్లు నీరు వస్తున్నది.
1) ఉస్మాన్సాగర్ ` 25 ఎంజిడి
2) హిమాయత్సాగర్ ` 14 ఎంజిడి
3) కృష్ణా ఫేజ్ 1 `90 ఎంజిడి
4) కృష్ణా ఫేజ్ 2 ` 90 ఎంజిడి
5) మంజీరా(సింగూరు) ` 120 ఎంజిడి
మొత్తం 340 ఎంజిడిలు వస్తున్నాయి. ప్రస్తుతం 700 ఎంజిడిలు రోజుకు కావాలి. ప్రపంచంలో ఇంత వత్యాసం ఎక్కడా లేదు. మూడవ దశగా కృష్ణా నుండి రు.1670 కోట్లతో 1.6.2013న కిరణ్కుమార్రెడ్డిగారు మూడవదశ మరో 90 ఎంజిడిలకు శంఖుస్థాపన చేశారు. పనులు సాగుతున్నాయి. పట్టణ జనాభా పెరిగిపోతున్నది. ఇప్పటికీ చుట్టుపక్కల గ్రామాలలో పట్టణానికి ఆనుకొని ఉన్నవాటికి త్రాగునీటి సౌకర్యంలేదు. ప్రస్తుతం మెట్రోపాలిటన్ మరో 600 చ. కి.మీలకు వ్యాపించి ఉంది. మరో 100చ. కిమీ పెరగబోతున్నది. ప్రస్తుతం హైదరాబాదులో 5.3 లక్షల పంపుసెట్ల కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. బచావత్ తీర్పు ప్రకారం కృష్ణా జలాల నుండి హైదరాబాదుకు త్రాగునీటికి సంవత్సరానికి 3.90 టిఎంసిలు మాత్రమే తీసుకురావాలి. కానీ ఇప్పటికీ ఇప్పటి మూడు దశలు రోజుకు 270 ఎంజిడిల నీటిని రాబడుతున్నారు. అనగా సంవత్సరానికి 16 టిఎంసిల కృష్ణా జలాలను వినియోగిస్తున్నారు. నాగార్జునసాగర్ నీటి లెవెల్ 511 అడుగులు ఉన్నప్పుడు డెడ్స్టోరేజీ 175 టిఎంసిలు ఉంటాయి. వీటిని వినియోగించరాదని జి.వో 69/1996లో అఖిలపక్షం ఆమోదంతో తెచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో డెడ్స్టోరేజీ నుండి త్రాగునీటిని వినియోగించవచ్చు.
హైదరాబాదు పట్టణానికి గోదావరి జలాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు 120 ఎంజిడి గోదావరి ఉపనది మంజీరా నుండి నగరానికి వస్తున్నాయి. అనగా సంవత్సరానికి 7 టిఎంసిలు తెస్తున్నారు. గోదావరిలో ప్రాణహిత ఇంద్రావతిలు కలిసిన తరువాత నీరు పుష్కలంగా ఉంటుంది. యేటా 4000 టిఎంసిల వరకు సముద్రంపాలవుతున్నాయి. ప్రాణహిత కలిసిన తరువాత(కాళేశ్వరం నుండి) 30 కి.మీల దిగువన గోదావరిపై కంతాలపెల్లి ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట నుండి హైదరాబాదు పట్టణానికి 50 టిసిఎంల నీటిని తెచ్చే అవకాశం ఉంది. దీనికి ఎలాంటి ఆటంకాలు లేవు. మనం వినియోగించకున్నా నీరు వృధాగా సముద్రం పాలవుతాయి. కంతాలపెల్లి ప్రాజెక్టుకు 19.2.2009న రాజశేఖరరెడ్డిగారు శంఖుస్థాపన చేశారు. G85 మీటర్ల ఎత్తు నుండి నల్లగొండ జిల్లాలోని ఆలేరు నదిపై నిర్మించే బేగంపేట రిజర్వాయర్, G 520మీ వరకు 4 ఎత్తిపోతల ద్వారా నీటిని తేవాలి. కంతాలపెల్లి నుండి ఆలేరుకు 170 కి.మీ దూరం కాగా ఆలేరు నుండి హైదరాబాదుకు 70కి.మీ దూరం ఉంటుంది. అనగా కంతాలపెల్లి నుండి 240 కి.మీ లలో హైదరాబాదుకు త్రాగునీటిని అందించవచ్చు.
హైదరాబాదులో త్రాగునీటి వ్యాపారం పెద్దఎత్తున సాగుతున్నది. ఈ వ్యాపారవేత్తలు మెట్రో త్రాగునీటిని కూడా తమ వ్యాపారానికి వినియోగించుకుంటున్నారు. కిన్లే కంపెనీ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రోజుకు 1కోటి రూపాయల లాభం సంపాదిస్తున్నది. గ్రామస్తులకు మాత్రం త్రాగునీటి ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి.
త్రాగునీటి వనరుల కల్పనకు ప్రస్తుతమున్న పథకాలన్నిటినీ ఒక ఎజెండా కిందకి తెచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధులను, విదేశీ సహాయాన్ని అన్నింటిని ఒకే వ్యవస్థ ద్వారా వ్యయం చేయాలి. వివిధ వ్యవస్థల కింద చెపట్టడం వలననే ఈ దుస్థితి కొనసాగుతున్నది. త్రాగునీటి వ్యాపారాన్ని నిషేధించాలి. బహుళజాతి సంస్థలను త్రాగునీటి వ్యాపారం చేయకుండా కట్టుదిట్టం చేయాలి. ఇందుకు ప్రభుత్వం చొరవ చూపాలి.
సారంపల్లి మాల్లారెడ్డి
20.04.2012
ఆర్శనిక్ మందులు, ఫ్లోరైడ్ నీరు, చౌడు కలిసిన నీరు(సెలినిటి) ఇనుము తదితర ఖనిజ లవణాలు కలిసిన నీరు, నైట్రేట్స్ మరియు బ్యాక్టీరియా కలుషితం జరిగిన నీటిని త్రాగునీటిగా వినియోగిస్తున్నాం. భారత దేశస్థాయిలో 11.51 లక్షల గ్రామాలకు రక్షిత నీరు ఉన్నట్టు, 5.70 లక్షల గ్రామాలకు పాక్షికంగా సరఫరా చేస్తున్నట్టు, 1.44 లక్షల గ్రామాలు కలుషిత నీటిని వినియోగిస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. 85శాతం భూగర్భ జలాలపైననే ఆధారపడి ఉన్నారు. 35శాతం పైపు వాడుతున్నారు. 12శాతం మాత్రమే రక్షిత నీటి ట్యాపులు పని చేస్తున్నాయి. రాష్ట్రంలో భూగర్భ జలాల లభ్యత 34,700 మిలియన్ క్యూబిక్ మీటర్లు లభ్యత ఉండగా, 14,112 మిలియన్ క్యూబిక్ మిటర్లు మాత్రమే వినియోగిస్తున్నాం. అనేక పథకాలు ప్రవేశపెట్టి త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఈ విధంగా వున్నాయి.
1) అత్యవసర గ్రామీణ నీటి సరఫరా పథకం(ఎఆర్డబ్ల్యుఎస్). దీనిని భారత ప్రభుత్వం 1972`73లో ప్రారంభించి 1973`74లో ఉపసంహరించింది. తిరిగి 1977`78లో కొనసాగించింది. 2009`10లో ఈ పథకం పేరు ఎన్ఆర్డిడబ్ల్యుపి (నేషనల్ రూరల్ డెవలప్మెంట్ వాటర్ ప్రాజెక్టు)గా మార్చారు.
2) కనీస అవసర కార్యక్రమం(ఎమ్ఎన్పి). ఐదవ పంచవర్ష ప్రణాళికలో గ్రామీణ త్రాగునీటి సరఫరా కోసం ఈ పథకాన్ని తెచ్చారు. ముఖ్యంగా దళితులు, గిరిజనుల సబ్ప్లాన్ నిధులను వినియోగించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలి.
3) ప్రధానమంత్రి గ్రామోదయ యోజన గ్రామీణ నీటి సరఫరా పథకం(పిఎమ్జివై`ఆర్డబ్ల్యుఎస్పి), దీనిని 2000`01లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామోదయ యోజన కింద ప్రారంభించింది. ఈ పథకానికి ఎమ్ఎన్పి(దళిత, గిరిజన సబ్ప్లాన్) నిధులను కూడా కలిపారు.
4) నాబార్డ్(ఆర్ఐడిఎఫ్), 2000`01 సంవత్సరం నాబార్డ్ ఆర్థిక సహాయంతో గ్రామీణ త్రాగునీటి పథకాలు ప్రారంభించారు. ఇందులో నాబార్డు 85శాతం, రాష్ట్ర ప్రభుత్వం 15శాతం భరించాలి.
5) అంబేద్కర్ జీవనధార(ఎజెడి), ప్రధానంగా దళిత, గిరిజనులు నివసించే ప్రాంతాలకు గ్రామీణ త్రాగునీటి పథకం వర్తింప చేయడానికి దీనిని ఉద్దేశించారు.
6) హడ్కో 2004`05లో (హౌసింగ్ Ê అర్బన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (హడ్కో) నుండి గ్రామీణ త్రాగునీటి పథకాలకు మరియు సమస్యాత్మక గ్రామాలకు త్రాగునీటి సరఫరాకు ఆర్థిక సహాయం చేస్తారు.
7) ఎడారి అభివృద్ధి కార్యక్రమం(డిడిపి), కేంద్ర ప్రభుత్వం 100శాతం సహాయంతో అనంతపూర్ జిల్లాలో ప్రజలకు, పశువులకు త్రాగునీటి సహకారానికి నిధులు కేటాయించాలి.
8) స్వజలధార కార్యక్రమం, 25 డిసెంబర్ 2002న ప్రధాన మంత్రి వాజ్పేయిగారు ఆంధ్రప్రదేశ్, ఆదిలాబాద్ జిల్లా ఆవాల్పూర్ గ్రామంలో త్రాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం మూడు మాసాలు నడవగానే మూతపడిరది. ఇలాంటి పథకాలను మరిన్ని గ్రామాలలో పెట్టడానికి ప్రయత్నించి విఫలం చెందారు. పై కేంద్ర ప్రభుత్వ పథకాలే కాక కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారానూ, ప్రణాళికా నిధుల ద్వారానూ అనేక పథకాలు చేపట్టి అర్ధాంతరంగా నిలిపివేశారు. చివరికి గ్రామాలలో త్రాగునీటి సౌకర్య కల్పనకు పథకాలు రూపొందించారు. అయినా ఇంతవరకూ త్రాగునీటి సమస్య పరిష్కరించబడలేదు.
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి :
రాష్ట్రంలో 8.46 కోట్ల జనాభా (2011) ఉండగా 6.40 కోట్ల మంది గ్రామాలలో నివసిస్తున్నారు. 6 జిల్లాలలో గిరిజనులు అడవి ప్రాంతాలలో నివసిస్తున్నారు. నేటికీ గ్రామిణ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలోనూ నివసించే ప్రజల త్రాగునీటి పరిస్థితి అత్యంత హృదయ విదారకంగా ఉంది. 4`5 కి.మీల నుండి తెచ్చుకున్న నీటిని బహు జాగ్రత్తగా వాడుకోవాలి. మొత్తం గ్రామాలు 72,147 ఉండగా (21,634 గ్రా.పం) రోజుకు తలసరి 40లీటర్లు వినియోగించే గ్రామాలు 36,727 ఉన్నాయి. 10`39లీ. వినియోగించే గ్రామాలు 34,074 ఉన్నాయి. మిగిలినవి 10లీ లోపు వినియోగించే గ్రామాలు. 210 పట్టణాలకు కల్పించిన త్రాగునీటి వనరులు పట్టణ ప్రాంతాలకు కల్పించలేదు. మొత్తం గ్రామాలలో 3,33,123 చేతి పంపులు, 46,451 పిడబ్ల్యుఎస్ స్కీమ్లు, 462 సిపిడబ్ల్యుఎస్ స్కీమ్లు, 51 నీటి పరిక్షా కేంద్రాలు పని చేస్తున్నాయి. కానీ ఇందులో 35శాతం చేతి పంపులు పని చేయడం లేదు. రిపేర్లు చేయడానికి గ్రామపంచాయితీల వద్ద నిధులు లేక గ్రామాలలో త్రాగునీటి కొరత తీవ్రంగా ఉంది. యేటా మార్చి నెల ప్రవేశించినప్పటి నుండి జూలై ఆఖరు వరకు గ్రామాలలో త్రాగునీరు లభ్యత లేదు. జనగామా నియోజకవర్గంలోని పట్టణాలకు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నియోజకవర్గంలోని గ్రామాలకు నీటిని ఫీల్టర్ చేయకుండానే, డీ`ఫ్లోరైడ్ చేయకుండానే సరఫరా చేస్తున్నారు. దీనివల్ల గతంలో ఉన్న ఆరోగ్యం కూడా దెబ్బతిని ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో చెక్డ్యాంలు, ఊటచెరువులు, ఉపరితల కుంటలు, వర్షపు కుంటలు, రీఛార్జ్ కుంటలు, భారీ మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్నప్పటికీ త్రాగునీటి కొరత తీవ్రంగా ఉంది.
1969`2007 వరకు త్రాగునీటికి రాష్ట్రంలో 65.83 కోట్ల వ్యయం జరిగింది. ఈ దిగువ పనులు చేసారు.
(1) హాండ్పంపులు (2) ఎస్విఎస్ (సింగిల్ విలేజ్) స్కీమ్లు (3) ఎంవిఎస్ (బహుళ గ్రామాలు) స్కీమ్లు
ఉపరితల నీటి వినియోగం 23% మరియు భూగర్భజలాలు 72% వినియోగంలోకి తేవడానికి అంచనా వేసారు.
రాష్ట్రంలో మొత్తం గ్రామాలు 72147 ఉండగా 50శాతం గ్రామాలకు కూడా రక్షిత నీరు లేదు. ఆ ప్రయత్నమే లేదు. పథకాలెన్ని ప్రవేశపెట్టినా గ్రామీణ నీటి సరఫరా నేటికీ పూర్తికాలేదు. ఇక పట్టణాల సంగతి సరేసరి. 210 పట్టణాల్లో త్రాగునీటి కన్నా మురుగునీటి పారుదల సమస్యగా ఉంది. సీవరేజ్ బోర్డువారు త్రాగునీరు ` డ్రైనేజీ (సానిటేషన్) రెండు వ్యవస్థలను నిర్వహిస్తున్నారు. రకరకాల పథకాలతో ప్రవేశపెట్టిన త్రాగునీటి పథకాలు, శానిటేషన్ పథకాలు మధ్య దళారీలు కాజేస్తున్నారు. పట్టణాల్లో కాంట్రాక్టర్లే మున్సిపాలిటీలను కార్పొరేషన్ల నిధుల వ్యయంపై పెత్తనం చెలాయిస్తున్నారు. చివరకు త్రాగునీటిని వ్యాపారంగా మార్చివేసారు.
త్రాగునీటి వ్యాపారం :
సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో త్రాగునీటిని వ్యాపార సరుకుగా మార్చివేశారు. బహుళజాతి సంస్థలు ఈ రంగంపై గుత్తాధిపత్యం కలిగి వేల కోట్లు ఆర్జిస్తున్నారు. సోయూజ్ లియోన్నాయిస్, మెక్డోనాల్డ్, కోకోకోలా(కిన్లే) పెప్సి, మోన్శాంటో, థామస్వాటర్, నార్త్వెస్ట్వాటర్, వివిండ్ఎన్విరాన్మెంట్, ఎన్రాన్, కింగ్ఫిషర్ లాంటి సంస్థలు వేల కోట్ల త్రాగునీటి వ్యాపారం సాగిస్తున్నాయి. టాటా కంపెనీతో యురేకా ఫోర్బ్స్ జాయింట్ వెంచర్గా కలిసి నీటి వ్యాపారం సాగిస్తున్నారు. వీరంతా త్రాగునీటి వ్యాపారం చేయడం ఫలితంగా ప్రభుత్వం ఉచితంగా రక్షిత త్రాగునీటిని అందించే పథకాలకు అడ్డుపడుతున్నారు. గ్రామీణ రక్షిత పథకాలను చేపట్టి దశాబ్దాలు గడిచినా పెండిరగులో పెడుతున్నారు. రాష్ట్రంలో ఈ బహుళజాతి సంస్థలు ఏర్పాటు చేసిన 56 మందుల తయారీ కంపెనీలు వదులుతున్న కాలుష్యం త్రాగునీటిలోకి చేరినట్టు పరిశోధనల ద్వారా తెలిసింది. మద్యం తయారీకి వేల కోట్ల లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. 1లీ బీరు తయారు చేయడానికి 10లీ ల నీరు కావాలి. ప్రస్తుతం త్రాగునీరు రు.15`20 ఉండగా లీటరు పాలు గ్రామాలలో రు.15`20 అమ్ముతున్నారు. ప్రస్తుతం నీటి వ్యాపారం ప్రపంచవ్యాపితంగా యేటా 400 కోట్ల డాలర్ల వ్యాపారం సాగుతున్నది. గ్రామాలలో డీ`ఫ్లోరైడేషన్ చిన్న యంత్రాలను పెట్టి ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. వీరు సరఫరా చేసే నీటికన్నా బోరునీరు వినియోగం మంచిదని పరిశీలకులు చెప్తున్నారు. కానీ ఈరోజు ప్రతి కుటుంబం త్రాగునీరు కొనుగోలుపైననే ఆధారపడి వుంటున్నారు.
హైదరాబాదు పట్టణ త్రాగునీటి సమస్య :
హైదరాబాదు నగరంలో సంపన్నుల కాలనీలో ఎలాంటి ఆటంకం లేకుండా అధిక మొత్తంలో నీరు సరఫరా అవుతుండగా పేదలు నివసించే బస్తీలలో సరఫరా తక్కువగా ఉంటుంది. సంపన్న కాలనీవాసులు సరఫరా అవుతున్న నీటిని వాహనాలు కడగడానికి, చెట్లకు పెట్టడం, స్విమ్మింగ్ఫూల్స్, పెంపుడు జంతువులకు స్నానం చేయించడం లాంటి వాటికి వినియోగిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాదు పట్టణానికి ఈ దిగువ విధంగా రోజుకు మిలియన్గాలన్లు నీరు వస్తున్నది.
1) ఉస్మాన్సాగర్ ` 25 ఎంజిడి
2) హిమాయత్సాగర్ ` 14 ఎంజిడి
3) కృష్ణా ఫేజ్ 1 `90 ఎంజిడి
4) కృష్ణా ఫేజ్ 2 ` 90 ఎంజిడి
5) మంజీరా(సింగూరు) ` 120 ఎంజిడి
మొత్తం 340 ఎంజిడిలు వస్తున్నాయి. ప్రస్తుతం 700 ఎంజిడిలు రోజుకు కావాలి. ప్రపంచంలో ఇంత వత్యాసం ఎక్కడా లేదు. మూడవ దశగా కృష్ణా నుండి రు.1670 కోట్లతో 1.6.2013న కిరణ్కుమార్రెడ్డిగారు మూడవదశ మరో 90 ఎంజిడిలకు శంఖుస్థాపన చేశారు. పనులు సాగుతున్నాయి. పట్టణ జనాభా పెరిగిపోతున్నది. ఇప్పటికీ చుట్టుపక్కల గ్రామాలలో పట్టణానికి ఆనుకొని ఉన్నవాటికి త్రాగునీటి సౌకర్యంలేదు. ప్రస్తుతం మెట్రోపాలిటన్ మరో 600 చ. కి.మీలకు వ్యాపించి ఉంది. మరో 100చ. కిమీ పెరగబోతున్నది. ప్రస్తుతం హైదరాబాదులో 5.3 లక్షల పంపుసెట్ల కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. బచావత్ తీర్పు ప్రకారం కృష్ణా జలాల నుండి హైదరాబాదుకు త్రాగునీటికి సంవత్సరానికి 3.90 టిఎంసిలు మాత్రమే తీసుకురావాలి. కానీ ఇప్పటికీ ఇప్పటి మూడు దశలు రోజుకు 270 ఎంజిడిల నీటిని రాబడుతున్నారు. అనగా సంవత్సరానికి 16 టిఎంసిల కృష్ణా జలాలను వినియోగిస్తున్నారు. నాగార్జునసాగర్ నీటి లెవెల్ 511 అడుగులు ఉన్నప్పుడు డెడ్స్టోరేజీ 175 టిఎంసిలు ఉంటాయి. వీటిని వినియోగించరాదని జి.వో 69/1996లో అఖిలపక్షం ఆమోదంతో తెచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో డెడ్స్టోరేజీ నుండి త్రాగునీటిని వినియోగించవచ్చు.
హైదరాబాదు పట్టణానికి గోదావరి జలాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు 120 ఎంజిడి గోదావరి ఉపనది మంజీరా నుండి నగరానికి వస్తున్నాయి. అనగా సంవత్సరానికి 7 టిఎంసిలు తెస్తున్నారు. గోదావరిలో ప్రాణహిత ఇంద్రావతిలు కలిసిన తరువాత నీరు పుష్కలంగా ఉంటుంది. యేటా 4000 టిఎంసిల వరకు సముద్రంపాలవుతున్నాయి. ప్రాణహిత కలిసిన తరువాత(కాళేశ్వరం నుండి) 30 కి.మీల దిగువన గోదావరిపై కంతాలపెల్లి ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట నుండి హైదరాబాదు పట్టణానికి 50 టిసిఎంల నీటిని తెచ్చే అవకాశం ఉంది. దీనికి ఎలాంటి ఆటంకాలు లేవు. మనం వినియోగించకున్నా నీరు వృధాగా సముద్రం పాలవుతాయి. కంతాలపెల్లి ప్రాజెక్టుకు 19.2.2009న రాజశేఖరరెడ్డిగారు శంఖుస్థాపన చేశారు. G85 మీటర్ల ఎత్తు నుండి నల్లగొండ జిల్లాలోని ఆలేరు నదిపై నిర్మించే బేగంపేట రిజర్వాయర్, G 520మీ వరకు 4 ఎత్తిపోతల ద్వారా నీటిని తేవాలి. కంతాలపెల్లి నుండి ఆలేరుకు 170 కి.మీ దూరం కాగా ఆలేరు నుండి హైదరాబాదుకు 70కి.మీ దూరం ఉంటుంది. అనగా కంతాలపెల్లి నుండి 240 కి.మీ లలో హైదరాబాదుకు త్రాగునీటిని అందించవచ్చు.
హైదరాబాదులో త్రాగునీటి వ్యాపారం పెద్దఎత్తున సాగుతున్నది. ఈ వ్యాపారవేత్తలు మెట్రో త్రాగునీటిని కూడా తమ వ్యాపారానికి వినియోగించుకుంటున్నారు. కిన్లే కంపెనీ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రోజుకు 1కోటి రూపాయల లాభం సంపాదిస్తున్నది. గ్రామస్తులకు మాత్రం త్రాగునీటి ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి.
త్రాగునీటి వనరుల కల్పనకు ప్రస్తుతమున్న పథకాలన్నిటినీ ఒక ఎజెండా కిందకి తెచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధులను, విదేశీ సహాయాన్ని అన్నింటిని ఒకే వ్యవస్థ ద్వారా వ్యయం చేయాలి. వివిధ వ్యవస్థల కింద చెపట్టడం వలననే ఈ దుస్థితి కొనసాగుతున్నది. త్రాగునీటి వ్యాపారాన్ని నిషేధించాలి. బహుళజాతి సంస్థలను త్రాగునీటి వ్యాపారం చేయకుండా కట్టుదిట్టం చేయాలి. ఇందుకు ప్రభుత్వం చొరవ చూపాలి.
సారంపల్లి మాల్లారెడ్డి
20.04.2012
2014`15 కేంద్రబడ్జెట్ వ్యవసాయాభివృద్ధికి తోడ్పడుతుందా.?
2014`15 సంవత్సరానికి ఆర్థిక మంత్రి చిదంబరం 20 ఫిబ్రవరి 2014న లోక్సభలో ఓట్ఆన్ అక్కౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత సంవత్సరం బడ్జెట్ రూ.15,90,434 కోట్లు కాగా రూ. 2014`15 బడ్జెట్ను రూ. 17,63,214 కోట్లకు పెంచి పార్లమెంట్లో ప్రకటించారు. ఇందులో వ్యవసాయ రంగానికి ప్రణాళికా బడ్జెట్ క్రింద రూ. 21,609కోట్లు, పరిశోదనలకు రూ. 3,415 కోట్లు, పశు సంవర్థనకు రూ.2,074 కోట్లు కలిపి మొత్తం రూ. 27,098కోట్లు చూపారు. గత సంవత్సరంపై రూ. 3,616 కోట్లు అదనంగా చూపారు. ప్రణాళికేతర బడ్జెట్గా రూ. 2865 కోట్లు చూపారు. ప్రణాళికా బడ్జెట్లో వ్యవసాయ ప్రణాళికా బడ్జెట్ 4.88 శాతంగా వుంది. మొత్తం బడ్జెట్ను పరిశీలించినప్పుడు మొత్తం బడ్జెట్లో వ్యవసాయ బడ్జెట్లో వ్యవసాయ బడ్జెట్ 1.70 శాతం మాత్రమే. గత సంవత్సరంపై బడ్జెట్ పెరిగినా గత సంవత్సరం కేటాయించిన శాతం కంటే తక్కువే. అందువల్ల వ్యవసాయ రంగం వృద్ధిరేటు కూడా తగ్గుతూనే ఉంది.
వ్యవసాయ గ్రోత్రేటు (2004`05సంవత్సర ధరల ప్రకారం)
2010`11 8.9 శాతం
2011`12 6.7 శాతం
2012`13 4.5 శాతం
2013`14 4.9 శాతం
ఉత్పత్తి తగ్గుతునప్పటికి ప్రాధాన్యతా రంగానికి నిధులు కేటాయించడానికి సుంకంగా లేదు. ఆహార దాన్యాల ఉత్పత్తి 2011`12లో 25.93 కోట్ల టన్నులు కాగా 2012`13లో 25.54కోట్ల టన్నులకు తగ్గింది. సహాకార రుణాలు పెద్దఎత్తున పెంచుతున్నట్టు ప్రకటించారు. కానీ వాస్తవ సాగు దార్లకు రుణాలు అందటం లేదు. వ్యవసాయ అవసరాల పేర బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొంది ఇతర వ్యాపారాలకు మళ్ళించిన వారి రుణాలు, కోల్డ్ స్టోరేజీలకు, భారీ యంత్రాలకు (హార్వెస్టర్స్)కు, భూమి సాగు చేయని భూ యజమానులు తీసుకున్న రుణాలను వ్యవసాయ రుణాలుగా పరిగణిస్తున్నారు. వాస్తవానికి బ్యాంకులిచ్చిన వ్యవసాయ రుణాలలో 50శాతం కూడా వాస్తవ సాగు దార్లకు చేరడంలేదు.
రుణ పంపిణీ ఈ విధంగా ఉంది రూ. కోట్లలో
2003`04 86,981
2011`12 5,11,029
2012`13 6,07,375
2013`14 7,35,000
2014`15 సంవత్సరానికి గతం కన్నా తక్కువగా 7 లక్షల కోట్ల లక్ష్యాన్ని నిర్ణయించింది. 2013`14 సంవత్సరానికి ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంపుదల చేస్తూ 25.54కోట్ల టన్నుల నుండి 25.30 కోట్ల టన్నులకు పెరుగు తుందని అంచనా వేసారు రబ్బీ పంట ఇంకా చేతికి రావలసి ఉంది. 2013`14లో వ్యవసాయ ఎగుమతులు 41 బిలియన్ డాలర్లకు చేరుతాయని దిగుమతులు 20 బిలియన్ డాలర్లు ఆర్థిక సర్వేలో సూచించారు. వ్యవసాయ గ్రోత్రేటు జిడిపిలో 3.1 శాతంగా ఉంటుందని దీనిని నాలుగు శాతానికి పెంచడానికి ప్రయత్నిస్తామని ఆర్థిక మంత్రి చిదంబంరం తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.
ఈ నిధులతో వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదక పెరుగుతుందా.? 2013`14లో కేంద్రం రాష్ట్రాలకు రూ.11,911కోట్లు కేటాయించగా 2014`15 సంవత్సరం రూ. 4,321కోట్లు మాత్రమే కేటాయించడాన్ని బట్టి చూస్తే వ్యవసాయంపై కేంద్రానికున్న శ్రద్ధ కనబడుతుంది. ముఖ్యంగా పరిశోధనలకు రానురానూ నిధులు తగ్గుతున్నాయి. 2014`15కు రూ. 3,415కోట్లు మాత్రమే కేటాయించారు. ఒక్క ఆంద్రప్రదేశ్లోనే 27 పరిశోధనా కేంద్రాలక్రింద 5,030 ఎకరాల భూమి ఉంది. 2005నుండి క్రమంగా వ్యవసాయ పరిశోధనలు తగ్గుతూ నేడు పూర్తిగా ఆపివేసారు. విదేశీ టెక్నాలజీని దిగుమతి చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మన్సాంటో, డూపాయింట్, కార్గిల్, సింజెంటా లాంటి కంపెణీల పరిశోధనలపై మన ప్రభుత్వాలు ఆధారపడే దుస్థితికి నెట్టబడ్డాయి. హరిత విప్లవంలో ఐదు రెట్లు ఆహార దాన్యాల ఉత్పత్తిని పెంచి దేశాన్ని స్వయం పోషకత్వంలోకి తెచ్చిన వ్యవసాయ విధానాలు సరళీకరించి 2005 నుండి దిగుమతులపై ఆధారపడే పరిస్థితికి నెట్టారు. ధనిక దేశాలు తమ ఆహార దాన్యాలను మనకు అవసరం ఉన్నాలేకున్నా దిగుమతులు చేస్తూనే ఉన్నారు. వంట నూనెలు, పంచదార, పత్తి, పట్టు, ఉత్పత్తులను పెద్ద ఎత్తున దిగుమతి చేస్తున్నారు. వారికి అనుకూలంగా దిగుమతి సుంకాలను కూడా పూర్తిగా రద్ధు చేసారు.
దేశంలోకి వంటనూనెల దిగుమతులు ఇలా ఉన్నాయి. (దిగుమతులు, ఉత్పత్తి : లక్షల టన్నులలో, విలువ : కోట్ల రూపాయలలో)
దేశంలో నూనె గింజల ఉత్పత్తికి అవకాశాలున్నప్పటికీ అందుకు తగిన నిధుల కేటాయించక పోవడం వల్ల ఉత్పత్తిలో తగినంత సాధించలేక పోయాం. మన దేశీయ ఉత్పత్తి ఈ విధంగా ఉంది.
కొన్ని నూనెగింజల పంటల పరిస్థితి ఈ దిగువ విధంగా ఉంది. (లక్షల టన్నులలో)
రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సోయా పంటకు మంచి అవకాశాలున్నాయి. ప్రస్తుతం పత్తి, మిరప పంటల వల్ల నష్టపోతున్న రైతులకు సోయా ఉత్పత్తి ఆశాజనకంగా ఉంటుంది. ఎకరాకు అతితక్కువ 8 క్వింటాళ్ళ నుండి 13 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. కనీస మద్దతు ధర రు.4500 ఉండాలి. అయినప్పటికీ కిలో నూనె రు.50లకు అమ్మవచ్చు. పెట్టుబడిపోగా ఎకరాకు రు.20వేలు గిట్టుబాటు అవుతుంది. ఇటు వినియోగదారులకు అటు ఉత్పత్తిదారులకు లాభదాయకంగా ఉంటుంది. గత సంవత్సరం మెదక్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో సోయా వేయడానికి రైతులు ముందుకు వచ్చినా కనీసం విత్తన సరఫరా చేయలేకపోయింది. చైనా, అమెరికాల్లో సోయా ఉత్పత్తి అత్యంత కీలకమైంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో మొదటి ర్యాంకులో ఉంది.
వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి బడ్జెట్లో కనీసం పది శాతం కేటాయించాలి. కనీసం పెట్టుబడి దారీ దేశాలలోని వ్యవసాయ విధానాలనైనా పాటించాలి.
సారంపల్లి మల్లారెడ్డి
24.02.2014
వ్యవసాయ గ్రోత్రేటు (2004`05సంవత్సర ధరల ప్రకారం)
2010`11 8.9 శాతం
2011`12 6.7 శాతం
2012`13 4.5 శాతం
2013`14 4.9 శాతం
ఉత్పత్తి తగ్గుతునప్పటికి ప్రాధాన్యతా రంగానికి నిధులు కేటాయించడానికి సుంకంగా లేదు. ఆహార దాన్యాల ఉత్పత్తి 2011`12లో 25.93 కోట్ల టన్నులు కాగా 2012`13లో 25.54కోట్ల టన్నులకు తగ్గింది. సహాకార రుణాలు పెద్దఎత్తున పెంచుతున్నట్టు ప్రకటించారు. కానీ వాస్తవ సాగు దార్లకు రుణాలు అందటం లేదు. వ్యవసాయ అవసరాల పేర బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొంది ఇతర వ్యాపారాలకు మళ్ళించిన వారి రుణాలు, కోల్డ్ స్టోరేజీలకు, భారీ యంత్రాలకు (హార్వెస్టర్స్)కు, భూమి సాగు చేయని భూ యజమానులు తీసుకున్న రుణాలను వ్యవసాయ రుణాలుగా పరిగణిస్తున్నారు. వాస్తవానికి బ్యాంకులిచ్చిన వ్యవసాయ రుణాలలో 50శాతం కూడా వాస్తవ సాగు దార్లకు చేరడంలేదు.
రుణ పంపిణీ ఈ విధంగా ఉంది రూ. కోట్లలో
2003`04 86,981
2011`12 5,11,029
2012`13 6,07,375
2013`14 7,35,000
2014`15 సంవత్సరానికి గతం కన్నా తక్కువగా 7 లక్షల కోట్ల లక్ష్యాన్ని నిర్ణయించింది. 2013`14 సంవత్సరానికి ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంపుదల చేస్తూ 25.54కోట్ల టన్నుల నుండి 25.30 కోట్ల టన్నులకు పెరుగు తుందని అంచనా వేసారు రబ్బీ పంట ఇంకా చేతికి రావలసి ఉంది. 2013`14లో వ్యవసాయ ఎగుమతులు 41 బిలియన్ డాలర్లకు చేరుతాయని దిగుమతులు 20 బిలియన్ డాలర్లు ఆర్థిక సర్వేలో సూచించారు. వ్యవసాయ గ్రోత్రేటు జిడిపిలో 3.1 శాతంగా ఉంటుందని దీనిని నాలుగు శాతానికి పెంచడానికి ప్రయత్నిస్తామని ఆర్థిక మంత్రి చిదంబంరం తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.
ఈ నిధులతో వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదక పెరుగుతుందా.? 2013`14లో కేంద్రం రాష్ట్రాలకు రూ.11,911కోట్లు కేటాయించగా 2014`15 సంవత్సరం రూ. 4,321కోట్లు మాత్రమే కేటాయించడాన్ని బట్టి చూస్తే వ్యవసాయంపై కేంద్రానికున్న శ్రద్ధ కనబడుతుంది. ముఖ్యంగా పరిశోధనలకు రానురానూ నిధులు తగ్గుతున్నాయి. 2014`15కు రూ. 3,415కోట్లు మాత్రమే కేటాయించారు. ఒక్క ఆంద్రప్రదేశ్లోనే 27 పరిశోధనా కేంద్రాలక్రింద 5,030 ఎకరాల భూమి ఉంది. 2005నుండి క్రమంగా వ్యవసాయ పరిశోధనలు తగ్గుతూ నేడు పూర్తిగా ఆపివేసారు. విదేశీ టెక్నాలజీని దిగుమతి చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మన్సాంటో, డూపాయింట్, కార్గిల్, సింజెంటా లాంటి కంపెణీల పరిశోధనలపై మన ప్రభుత్వాలు ఆధారపడే దుస్థితికి నెట్టబడ్డాయి. హరిత విప్లవంలో ఐదు రెట్లు ఆహార దాన్యాల ఉత్పత్తిని పెంచి దేశాన్ని స్వయం పోషకత్వంలోకి తెచ్చిన వ్యవసాయ విధానాలు సరళీకరించి 2005 నుండి దిగుమతులపై ఆధారపడే పరిస్థితికి నెట్టారు. ధనిక దేశాలు తమ ఆహార దాన్యాలను మనకు అవసరం ఉన్నాలేకున్నా దిగుమతులు చేస్తూనే ఉన్నారు. వంట నూనెలు, పంచదార, పత్తి, పట్టు, ఉత్పత్తులను పెద్ద ఎత్తున దిగుమతి చేస్తున్నారు. వారికి అనుకూలంగా దిగుమతి సుంకాలను కూడా పూర్తిగా రద్ధు చేసారు.
దేశంలోకి వంటనూనెల దిగుమతులు ఇలా ఉన్నాయి. (దిగుమతులు, ఉత్పత్తి : లక్షల టన్నులలో, విలువ : కోట్ల రూపాయలలో)
దేశంలో నూనె గింజల ఉత్పత్తికి అవకాశాలున్నప్పటికీ అందుకు తగిన నిధుల కేటాయించక పోవడం వల్ల ఉత్పత్తిలో తగినంత సాధించలేక పోయాం. మన దేశీయ ఉత్పత్తి ఈ విధంగా ఉంది.
కొన్ని నూనెగింజల పంటల పరిస్థితి ఈ దిగువ విధంగా ఉంది. (లక్షల టన్నులలో)
రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సోయా పంటకు మంచి అవకాశాలున్నాయి. ప్రస్తుతం పత్తి, మిరప పంటల వల్ల నష్టపోతున్న రైతులకు సోయా ఉత్పత్తి ఆశాజనకంగా ఉంటుంది. ఎకరాకు అతితక్కువ 8 క్వింటాళ్ళ నుండి 13 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. కనీస మద్దతు ధర రు.4500 ఉండాలి. అయినప్పటికీ కిలో నూనె రు.50లకు అమ్మవచ్చు. పెట్టుబడిపోగా ఎకరాకు రు.20వేలు గిట్టుబాటు అవుతుంది. ఇటు వినియోగదారులకు అటు ఉత్పత్తిదారులకు లాభదాయకంగా ఉంటుంది. గత సంవత్సరం మెదక్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో సోయా వేయడానికి రైతులు ముందుకు వచ్చినా కనీసం విత్తన సరఫరా చేయలేకపోయింది. చైనా, అమెరికాల్లో సోయా ఉత్పత్తి అత్యంత కీలకమైంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో మొదటి ర్యాంకులో ఉంది.
వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి బడ్జెట్లో కనీసం పది శాతం కేటాయించాలి. కనీసం పెట్టుబడి దారీ దేశాలలోని వ్యవసాయ విధానాలనైనా పాటించాలి.
సారంపల్లి మల్లారెడ్డి
24.02.2014
ప్రభుత్వాలు మానిఫెస్టోలు అమలు జరపాలి
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలకపక్ష పార్టీగా అవతరించింది. తన మానిఫెస్టోలో ‘‘రైతులందరికీ రుణమాఫీ, 8 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, పంపుసెట్లపై సర్ఛార్జీ రద్దు, విత్తనోత్పత్తి కేంద్రంగా తెలంగాణ, నిజామాబాద్ జిల్లాలో చెరుకు, పసుపు పరిశోధనా కేంద్రాల ఏర్పాటు గ్రీన్ హౌస్ కల్టివేటర్లకు 75శాతం సబ్సిడీ, చిన్న సాగునీటి వ్యవస్థ పునరుద్ధరిస్తామని’’ టిఆర్ఎస్ ప్రకటించింది.
అదేవిధంగా తెలుగుదేశం తన మానిఫెస్టోలో ‘‘వ్యవసాయ రుణాలమాపీపై తొలిసంతకం చేస్తానని, ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టడం, మెట్ట ప్రాంతాలకు సాగునీటి కల్పన, వాటర్హార్వెస్టింగ్, వాటర్షెడ్ పథకాలు, రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రు.1000 కోట్లతో మార్కెట్ ఇన్టర్వెన్షన్ఫండ్ ఏర్పాటు మరియు ఎం.ఎస్ స్వామినాధన్ చెప్పినట్టు వ్యవసాయ పంటలకు కనీస మద్ధతు ధర నిర్ణయం చేస్తామని’’ ప్రకటించారు.
వాస్తవానికి రుణమాఫీలు చేయాలంటే 29.05.2014 రోజున జరిగిన బ్యాంకర్ల కమిటీ సమీక్ష ప్రకారం రైతుల బకాయిలు ఆంధ్ర ప్రదేశ్లో రు.87,612 కోట్లు, తెలంగాణ రాష్ట్రంలో రు.49,564 కోట్లు ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీ మరియు టిడిపి పార్టీలు ప్రకటించినట్లు రుణాలు రద్దు చేయాలంటే మొత్తం రు.1,37,176 కోట్లు రద్దు చేయాలి. ఇది రాష్ట్ర బడ్జెట్ నుండే భరించాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులకు కౌంటర్ గ్యారంటీ ఇవ్వడం ద్వారా రుణాలు రద్దు చేసే అవకాశం ఉంటుంది. రుణమాఫీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకోవాలనుకుంటే ఒక సంవత్సరం వాయిదా మీరిన బాకీ కాకుండా 3 సంవత్సరాలు వాయిదా మీరిన బాకీలు(ఎన్.పి.ఎలలు) మాత్రమే రద్దు చేస్తామంటే అది రు.22,655 కోట్లకు పరిమితం అవుతుంది. కానీ రైతులు మొత్తం రుణాలు రద్దు అవుతాయని ఆశిస్తున్నారు. ఇప్పటికే సాగు సీజన్ మొదలైంది. జూన్ 15 నాటికి రైతులందరికీ రుణ పంపిణీ జరగాలి. ఇందులో కౌలుదారులకు మరియు ఇంత వరకు రుణం పొందని కొత్త రైతులకు రుణ సౌకర్యం కల్పించాలి. రెండు రాష్ట్రాలలో కలిపి 25 లక్షల మంది కౌలు రైతులు మరో 25 లక్షల మంది రుణం పొందని రైతులు ఉన్నట్లు బ్యాంకులు అంచనా వేశాయి. యేటా కౌలు రైతులకు రు. 2000 కోట్లు లక్ష్యంగా నిర్ణయిస్తూ 2011 నుండి నేటికీ యేటా రు.300 కోట్లకు మించి రుణాలు ఇవ్వలేదు. కొత్త రైతులకు యేటా 100 మందికి ప్రతి బ్రాంచి రుణాలు ఇవ్వాలని లక్ష్యం నిర్ణయిస్తున్నారు. ఈ విధానం వలన ఎన్ని దశాబ్దాలు గడిచినా రైతులకు తగినంత రుణం రాదు. అందువల్ల ప్రైవేటు వడ్డీలపై ఆధారపడి రుణగ్రస్తులై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత కొత్త ప్రభుత్వాలు గతంలో జరిగిన లోపాలను అధిగమించాలి.
ముఖ్యంగా వాస్తవ సాగుదారుపేరు రెవెన్యూ రికార్డులో నమోదు చేసి ప్రతివాడికి పాసుపుస్తకం ఇవ్వాలి. పాసు పుస్తకం ఉంటేనే రుణసౌకర్యంతోపాటు, విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు, ప్రకృతివైపరిత్యాల పరిహారం తీసుకోవడానికి, ప్రభుత్వ పథకాలను పొందడానికి ఉపయోగకరంగా ఉంటుంది. వేల కోట్ల ప్రభుత్వ పథకాలు వచ్చినప్పటికీ పాసు పుస్తకాలు లేక ఆర్హతగల వాళ్ళు తమ హక్కులు కోల్పోతున్నారు. అలాగే మైనర్ ఇరిగేషన్ రిపేర్లు సంవత్సరాల తరబడి లేకపోవడం వలన చెరువు కుంటలలో నీరు నిలువ ఉండడం లేదు. ఫలితంగా భూగర్భ జలాలు పెరగడంలేదు. చాలా మంది సన్న, చిన్నకారు రైతులు చిన్న నీటి వనరుల కిందనే సాగు చేస్తున్నారు. దాదాపుగా 85శాతంగా ఉన్న సన్నచిన్నకారు రైతులకు చిన్ననీటి వనరులతోపాటు లిప్టు పథకాల కింద సేద్యానికి వీలుగా సాగునీటి సౌకర్యం కల్పించాలి. ఉభయ రాష్ట్రాలలో 1850 లిప్టు పథకాలు ఉండగా వాటి కింద 7.5 లక్షల ఎకరాలు సాగువుతున్నది. ఇందులో 50 శాతం సాగుభూమి లిప్టులు పని చేయకపోవడం వలన పడావగా మారింది. తెలంగాణ జిల్లాల్లో గల 35 వేల చెరువుల కింద 16 లక్షల ఎకరాలు సాగు కావలసిన లోకలైజ్ ఆయకట్టు ఉండగా ప్రస్తుతం 4.5 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతున్నది. ఆంధ్రప్రదేశ్లో గల 37 వేల చెరువుల కింద 18 లక్షల ఎకరాలు సాగు కావలసి ఉండగా 9 లక్షల ఎకరాలు సాగవుతున్నది. దీనిపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. అదేవిధంగా రెండు ప్రభుత్వాలు ప్రకటించినట్లు నాణ్యతగల విద్యుత్తు 7`9 గంటలు సరఫరా చేసి 30 లక్షల బావుల కింద 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు రక్షణ కల్పించాలి.
విత్తనోత్పత్తి రాష్ట్రంలో విత్తనాల కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్లో ధరలు పెంచి రైతులను దోపిడీ చేస్తున్నారు. కనీస విత్తన చట్టం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు విత్తన చట్టాలు తెస్తామని తమ మానిఫెస్టోల్లో ప్రకటించారు. నాణ్యతగల విత్తనాలను రైతులకు అందజేయడానికి మార్కెట్ కమిటీల ద్వారా వాణిజ్యం నెరపాలి. బహుళజాతి సంస్థలను ఈ రంగం నుండి బహిష్కరించాలి. 2.5 ఎకరాల లోపు రైతులకు ఎరువులు విత్తనాలు పూర్తి సబ్సిడీపై ఇవ్వాలి. అప్పుడు మాత్రమే సన్నచిన్నకారు రైతులకు లబ్ది జరుగుతుంది.
ఎరువుల కొరత రాబోతున్నట్టు ముందే ప్రకటిస్తున్నారు. రాష్ట్రానికి రావలసిన ఎరువుల కేటాయింపు తగ్గించినట్లు చెప్తున్నారు. ఈ వార్తను ప్రచారంలో పెట్టి ఉన్న ఎరువులను బ్లాక్ మార్కెటింగ్ ద్వారా అధిక ధరలకు అమ్మాలనే ప్రయత్నమే తప్ప మరొకటికాదు. రాష్ట్రంలోనున్న మిక్సింగ్ ప్లాంట్లు నాణ్యతలేని ఎరువులను రైతులకు అంటగడుతున్నారు. సబ్సిడీ ఎరువులను అక్రమంగా మిక్సింగ్ ప్లాంట్లకు తరలిస్తున్నారు. వీటిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. రైతులకు ఎరువులు సకాలంలో అందించాలి. కల్తీలేని క్రిమి సంహారక మందులు కనీస ధరలకు అందుబాటులో పెట్టాలి. ప్రభుత్వ పథకాల కింద చిన్న రైతులకు వ్యవసాయ యంత్రాలను 90శాతం సబ్సిడీపై ఇవ్వాలి. సోయా, పొద్దుతిరుగుడు, వేరుశనగ, మొక్కజొన్న, పప్పుధాన్యాలు నూర్చే యంత్రాలను రైతులకు అందుబాటులో పెట్టాలి. భారీ యంత్రాలను నిరుత్సాహపర్చాలి. చిన్న యంత్రాలను ప్రోత్సహించాలి. దీనికి ప్రతి మండలంలో అద్దె, కొనుగోలు పద్దతిపై వ్యవసాయశాఖ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రతి మండలంలో ఎరువులు, క్రిమిసంహారక మందులను పరిశీలించే ల్యాబులను ఏర్పాటు చేయాలి. వ్యవసాయశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. ఆదర్శ రైతుల వ్యవస్థను తొలగించి వ్యవసాయ డిప్లమా హోల్డర్లను నియమించి రైతులకు సలహాలు, సహకరించే విధంగా చూడాలి. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో మధ్య దళారీల పాత్రను తగ్గించి ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలి. వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు అధిక ధర చెల్లించడంతోపాటు వినియోగదారులకు తక్కువ ధరకు సరుకులు అందించవచ్చు. దీనికి సివిల్ సప్లైయ్స్, మార్కెటింగ్ సంస్థలకు బాధ్యత అప్పజెప్పాలి. మార్కెట్ కమిటీలకు నేటికీ యేటా రు.500 కోట్లు పన్నులు వస్తున్నాయి. వీటిని ప్రభుత్వం ఇతర పనులకు వినియోగిస్తున్నది. అలాకాక మార్కెట్ యార్డునుండి గ్రామాలకు లింకు రోడ్లు, మార్కెట్యార్డులో త్రాగునీటి వసతులు ఏర్పాటు చేయాలి. మార్కెట్లకు వచ్చిన సరుకుకు నష్టం జరిగితే దానిని మార్కెట్ కమిటీలే భరించాలి. ఆ విధంగా రైతులకు ఏమాత్రం నష్టం జరగకుండా మార్కెట్ కమిటీల బాధ్యత ఉండాలి. ఉత్సాహం గల రైతు యువకులకు మార్కెట్ కమిటీలు, వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా ట్రేయినింగ్ క్లాసులు నిర్వహించాలి. పంటల భీమా పథకాన్ని రైతు ప్రయోజనాలకనుగుణంగా మార్పు చేసి అమలు చేయాలి. ప్రస్తుతం ఉన్న పంటల భీమా విధానం రైతాంగానికి ఏమాత్రం ఉపయోగకరంగా లేదు.
పై సమస్యల పరిష్కారానికి ‘‘వ్యవసాయ అభివృధ్ధి కమిటీలను’’ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పరచాలి. ఇందులో వ్యవసాయ నిపుణులు, మహిళా రైతులు, స్థానిక ఆదర్శరైతులు సభ్యులుగా ఉండాలి. వ్యవసాయ శాఖాధికారి కన్వీనర్గా ఉండాలి. దీనికి నిధులు కేటాయించాలి. వ్యవసాయ బడ్జెట్ విడిగా రూపొందించి శాసనసభ ఆమోదం పొందాలి. బడ్జెట్లో కనీసం 10శాతం నిధులు కేటాయించాలి. ఆ విధంగా ఎప్పటికప్పుడు వస్తున్న సమస్యలు పరిష్కరించడమేకాక రైతులు నష్టపోయినప్పుడు వెంటనే పరిహారం చెల్లించే విధంగా విధానాలు రూపొందించాలి.
సారంపల్లి మల్లారెడ్డి
తేది : 30.05.2014
అదేవిధంగా తెలుగుదేశం తన మానిఫెస్టోలో ‘‘వ్యవసాయ రుణాలమాపీపై తొలిసంతకం చేస్తానని, ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టడం, మెట్ట ప్రాంతాలకు సాగునీటి కల్పన, వాటర్హార్వెస్టింగ్, వాటర్షెడ్ పథకాలు, రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రు.1000 కోట్లతో మార్కెట్ ఇన్టర్వెన్షన్ఫండ్ ఏర్పాటు మరియు ఎం.ఎస్ స్వామినాధన్ చెప్పినట్టు వ్యవసాయ పంటలకు కనీస మద్ధతు ధర నిర్ణయం చేస్తామని’’ ప్రకటించారు.
వాస్తవానికి రుణమాఫీలు చేయాలంటే 29.05.2014 రోజున జరిగిన బ్యాంకర్ల కమిటీ సమీక్ష ప్రకారం రైతుల బకాయిలు ఆంధ్ర ప్రదేశ్లో రు.87,612 కోట్లు, తెలంగాణ రాష్ట్రంలో రు.49,564 కోట్లు ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీ మరియు టిడిపి పార్టీలు ప్రకటించినట్లు రుణాలు రద్దు చేయాలంటే మొత్తం రు.1,37,176 కోట్లు రద్దు చేయాలి. ఇది రాష్ట్ర బడ్జెట్ నుండే భరించాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులకు కౌంటర్ గ్యారంటీ ఇవ్వడం ద్వారా రుణాలు రద్దు చేసే అవకాశం ఉంటుంది. రుణమాఫీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకోవాలనుకుంటే ఒక సంవత్సరం వాయిదా మీరిన బాకీ కాకుండా 3 సంవత్సరాలు వాయిదా మీరిన బాకీలు(ఎన్.పి.ఎలలు) మాత్రమే రద్దు చేస్తామంటే అది రు.22,655 కోట్లకు పరిమితం అవుతుంది. కానీ రైతులు మొత్తం రుణాలు రద్దు అవుతాయని ఆశిస్తున్నారు. ఇప్పటికే సాగు సీజన్ మొదలైంది. జూన్ 15 నాటికి రైతులందరికీ రుణ పంపిణీ జరగాలి. ఇందులో కౌలుదారులకు మరియు ఇంత వరకు రుణం పొందని కొత్త రైతులకు రుణ సౌకర్యం కల్పించాలి. రెండు రాష్ట్రాలలో కలిపి 25 లక్షల మంది కౌలు రైతులు మరో 25 లక్షల మంది రుణం పొందని రైతులు ఉన్నట్లు బ్యాంకులు అంచనా వేశాయి. యేటా కౌలు రైతులకు రు. 2000 కోట్లు లక్ష్యంగా నిర్ణయిస్తూ 2011 నుండి నేటికీ యేటా రు.300 కోట్లకు మించి రుణాలు ఇవ్వలేదు. కొత్త రైతులకు యేటా 100 మందికి ప్రతి బ్రాంచి రుణాలు ఇవ్వాలని లక్ష్యం నిర్ణయిస్తున్నారు. ఈ విధానం వలన ఎన్ని దశాబ్దాలు గడిచినా రైతులకు తగినంత రుణం రాదు. అందువల్ల ప్రైవేటు వడ్డీలపై ఆధారపడి రుణగ్రస్తులై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత కొత్త ప్రభుత్వాలు గతంలో జరిగిన లోపాలను అధిగమించాలి.
ముఖ్యంగా వాస్తవ సాగుదారుపేరు రెవెన్యూ రికార్డులో నమోదు చేసి ప్రతివాడికి పాసుపుస్తకం ఇవ్వాలి. పాసు పుస్తకం ఉంటేనే రుణసౌకర్యంతోపాటు, విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు, ప్రకృతివైపరిత్యాల పరిహారం తీసుకోవడానికి, ప్రభుత్వ పథకాలను పొందడానికి ఉపయోగకరంగా ఉంటుంది. వేల కోట్ల ప్రభుత్వ పథకాలు వచ్చినప్పటికీ పాసు పుస్తకాలు లేక ఆర్హతగల వాళ్ళు తమ హక్కులు కోల్పోతున్నారు. అలాగే మైనర్ ఇరిగేషన్ రిపేర్లు సంవత్సరాల తరబడి లేకపోవడం వలన చెరువు కుంటలలో నీరు నిలువ ఉండడం లేదు. ఫలితంగా భూగర్భ జలాలు పెరగడంలేదు. చాలా మంది సన్న, చిన్నకారు రైతులు చిన్న నీటి వనరుల కిందనే సాగు చేస్తున్నారు. దాదాపుగా 85శాతంగా ఉన్న సన్నచిన్నకారు రైతులకు చిన్ననీటి వనరులతోపాటు లిప్టు పథకాల కింద సేద్యానికి వీలుగా సాగునీటి సౌకర్యం కల్పించాలి. ఉభయ రాష్ట్రాలలో 1850 లిప్టు పథకాలు ఉండగా వాటి కింద 7.5 లక్షల ఎకరాలు సాగువుతున్నది. ఇందులో 50 శాతం సాగుభూమి లిప్టులు పని చేయకపోవడం వలన పడావగా మారింది. తెలంగాణ జిల్లాల్లో గల 35 వేల చెరువుల కింద 16 లక్షల ఎకరాలు సాగు కావలసిన లోకలైజ్ ఆయకట్టు ఉండగా ప్రస్తుతం 4.5 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతున్నది. ఆంధ్రప్రదేశ్లో గల 37 వేల చెరువుల కింద 18 లక్షల ఎకరాలు సాగు కావలసి ఉండగా 9 లక్షల ఎకరాలు సాగవుతున్నది. దీనిపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. అదేవిధంగా రెండు ప్రభుత్వాలు ప్రకటించినట్లు నాణ్యతగల విద్యుత్తు 7`9 గంటలు సరఫరా చేసి 30 లక్షల బావుల కింద 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు రక్షణ కల్పించాలి.
విత్తనోత్పత్తి రాష్ట్రంలో విత్తనాల కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్లో ధరలు పెంచి రైతులను దోపిడీ చేస్తున్నారు. కనీస విత్తన చట్టం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు విత్తన చట్టాలు తెస్తామని తమ మానిఫెస్టోల్లో ప్రకటించారు. నాణ్యతగల విత్తనాలను రైతులకు అందజేయడానికి మార్కెట్ కమిటీల ద్వారా వాణిజ్యం నెరపాలి. బహుళజాతి సంస్థలను ఈ రంగం నుండి బహిష్కరించాలి. 2.5 ఎకరాల లోపు రైతులకు ఎరువులు విత్తనాలు పూర్తి సబ్సిడీపై ఇవ్వాలి. అప్పుడు మాత్రమే సన్నచిన్నకారు రైతులకు లబ్ది జరుగుతుంది.
ఎరువుల కొరత రాబోతున్నట్టు ముందే ప్రకటిస్తున్నారు. రాష్ట్రానికి రావలసిన ఎరువుల కేటాయింపు తగ్గించినట్లు చెప్తున్నారు. ఈ వార్తను ప్రచారంలో పెట్టి ఉన్న ఎరువులను బ్లాక్ మార్కెటింగ్ ద్వారా అధిక ధరలకు అమ్మాలనే ప్రయత్నమే తప్ప మరొకటికాదు. రాష్ట్రంలోనున్న మిక్సింగ్ ప్లాంట్లు నాణ్యతలేని ఎరువులను రైతులకు అంటగడుతున్నారు. సబ్సిడీ ఎరువులను అక్రమంగా మిక్సింగ్ ప్లాంట్లకు తరలిస్తున్నారు. వీటిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. రైతులకు ఎరువులు సకాలంలో అందించాలి. కల్తీలేని క్రిమి సంహారక మందులు కనీస ధరలకు అందుబాటులో పెట్టాలి. ప్రభుత్వ పథకాల కింద చిన్న రైతులకు వ్యవసాయ యంత్రాలను 90శాతం సబ్సిడీపై ఇవ్వాలి. సోయా, పొద్దుతిరుగుడు, వేరుశనగ, మొక్కజొన్న, పప్పుధాన్యాలు నూర్చే యంత్రాలను రైతులకు అందుబాటులో పెట్టాలి. భారీ యంత్రాలను నిరుత్సాహపర్చాలి. చిన్న యంత్రాలను ప్రోత్సహించాలి. దీనికి ప్రతి మండలంలో అద్దె, కొనుగోలు పద్దతిపై వ్యవసాయశాఖ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రతి మండలంలో ఎరువులు, క్రిమిసంహారక మందులను పరిశీలించే ల్యాబులను ఏర్పాటు చేయాలి. వ్యవసాయశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. ఆదర్శ రైతుల వ్యవస్థను తొలగించి వ్యవసాయ డిప్లమా హోల్డర్లను నియమించి రైతులకు సలహాలు, సహకరించే విధంగా చూడాలి. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో మధ్య దళారీల పాత్రను తగ్గించి ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలి. వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు అధిక ధర చెల్లించడంతోపాటు వినియోగదారులకు తక్కువ ధరకు సరుకులు అందించవచ్చు. దీనికి సివిల్ సప్లైయ్స్, మార్కెటింగ్ సంస్థలకు బాధ్యత అప్పజెప్పాలి. మార్కెట్ కమిటీలకు నేటికీ యేటా రు.500 కోట్లు పన్నులు వస్తున్నాయి. వీటిని ప్రభుత్వం ఇతర పనులకు వినియోగిస్తున్నది. అలాకాక మార్కెట్ యార్డునుండి గ్రామాలకు లింకు రోడ్లు, మార్కెట్యార్డులో త్రాగునీటి వసతులు ఏర్పాటు చేయాలి. మార్కెట్లకు వచ్చిన సరుకుకు నష్టం జరిగితే దానిని మార్కెట్ కమిటీలే భరించాలి. ఆ విధంగా రైతులకు ఏమాత్రం నష్టం జరగకుండా మార్కెట్ కమిటీల బాధ్యత ఉండాలి. ఉత్సాహం గల రైతు యువకులకు మార్కెట్ కమిటీలు, వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా ట్రేయినింగ్ క్లాసులు నిర్వహించాలి. పంటల భీమా పథకాన్ని రైతు ప్రయోజనాలకనుగుణంగా మార్పు చేసి అమలు చేయాలి. ప్రస్తుతం ఉన్న పంటల భీమా విధానం రైతాంగానికి ఏమాత్రం ఉపయోగకరంగా లేదు.
పై సమస్యల పరిష్కారానికి ‘‘వ్యవసాయ అభివృధ్ధి కమిటీలను’’ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పరచాలి. ఇందులో వ్యవసాయ నిపుణులు, మహిళా రైతులు, స్థానిక ఆదర్శరైతులు సభ్యులుగా ఉండాలి. వ్యవసాయ శాఖాధికారి కన్వీనర్గా ఉండాలి. దీనికి నిధులు కేటాయించాలి. వ్యవసాయ బడ్జెట్ విడిగా రూపొందించి శాసనసభ ఆమోదం పొందాలి. బడ్జెట్లో కనీసం 10శాతం నిధులు కేటాయించాలి. ఆ విధంగా ఎప్పటికప్పుడు వస్తున్న సమస్యలు పరిష్కరించడమేకాక రైతులు నష్టపోయినప్పుడు వెంటనే పరిహారం చెల్లించే విధంగా విధానాలు రూపొందించాలి.
సారంపల్లి మల్లారెడ్డి
తేది : 30.05.2014
నాలుగు దశాబ్దాలు గడిచినా పంటల బీమా ప్రయోగాత్మకమేనా?
2013 నవంబర్ 1న కేంద్ర ప్రభుత్వం ఎంఎన్ఎఐఎస్(మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చరల్ స్కీం)ను ప్రకటించింది. గతంలో నేషనల్ క్రాప్ ఇన్యూరెన్స్ మరియు రాష్ట్రీయ ఫసల్బీమా కార్యక్రమం పథకాలను కలిపి ఎంఎన్ఎఐఎస్ను ఏర్పాటు చేశారు. ఈ పథకం ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం, నెల్లూరు, వరంగల్ జిల్లాలను మాత్రమే ప్రయోగాత్మకంగా అమలు చేయ తలపెట్టారు. 2010`11లో ప్రారంభించిన ఈ పైలెట్ పథకానికి నేడు తూర్పుగోదావరి జిల్లాలోని వరి పంటలను కూడా తీసుకున్నారు. 2011 పంటల బీమా పథకాన్ని సమీక్షిస్తే వర్షబీమా పథకం కింద 8.82 లక్షల మంది బీమా చేసుకోగా 6.66 లక్షల మందికి క్లెయిమ్లు చెల్లించినట్టు ఎంఎన్ఐఎఎస్ కింది 40 వేల మంది ప్రీమియం చెల్లించగా 5 వేల మందికి క్లెయిమ్లు ఇచ్చినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. రెండు పథకాలకు కలిపి రైతుల నుండి వసూలు చేసిన ప్రీమియం 319.23 కోట్లు కాగా రైతులకు ఇచ్చిన క్లెయిములు 205.66 కోట్లు మాత్రమే. పంటల బీమా పథకం అంటే ప్రీమియంకు మించి క్లెయిములు వచ్చినపుడు ఏదో కారణంతో కోతలు పెట్టడం జరుగుతుంది. 2009`10లో మొదటిసారి ‘వర్షబీమా పథకం’ ప్రారంభించారు. 2010`11లో మాపిఫైడ్నేషన్ అగ్రికల్చరల్ ఇన్యూరెన్స్ పథకం ప్రయోగాత్మకంగా తెచ్చారు. ఇంత వరకు రాష్ట్రంలో పంటల బీమా పథకం వల్ల ఏరైతుకూ లాభం జరగలేదు. రుణం పొందినవారికి మాత్రమే తప్పనిసరి బీమా వర్తింపచేయడంతో వారు కూడా ప్రీమియం చెల్లించడానికి నిరాకరిస్తున్నారు. ప్రీమియం చెల్లించడం నుండి మినహాయింపు కోరుతూ కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల రైతులు హైకోర్టును ఆశ్రయించారు. నేటికీ పంటల బీమాపై అసంతృప్తిగానే ఉన్నారు.
బీమా చరిత్ర :
1970లో ధర్మనారాయణ కమిటీ పంటల బీమాపై అధ్యయనం చేసింది. అమలు కష్టసాధ్యమని, వ్యక్తిగతంగా అమలుపర్చమని కోరారు. ప్రొ॥దండేకర్ దీన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం 1972లో పంటల బీమా పథకం హెచ్`4 పత్తికి మాత్రమే పరిమితం చేశారు. నాటి నుండి 1999 వరకు ఇది ప్రయోగాత్మకంగా సాగింది.
(ప్రీమియం, క్లెయిములుRలక్షల రూపాయలలో)
మొదట 1985లో గుజరాత్, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు మాత్రమే వర్తింపచేశారు. 1994`99 వరకు 1రూపాయి ప్రీమియం చెల్లిస్తే రు.4 క్లెయిమ్ చేశారు. 2000 సంవత్సరం నుండి జాతీయ పంటల బీమా పథకాన్ని (ఎన్సిఐకి) అమలులోకి తెచ్చారు. ఈ పథకం కింద బీమాదారులకు క్లెయిములు రావడం అనేక చిక్కులతో ముడిపడి ఉంది. పంట నిలువుపై ఉన్నప్పుడు నష్టం జరిగితేనే క్లెయిములు చెల్లిస్తారు. పంట కోసి పొలంలోనే ఉండగా నష్టం జరిగినప్పుడు క్లెయిములు వర్తించవు. పైగా తాలూకా లేదా మండలం యూనిట్గా తీసుకొని నష్టాన్ని లెక్కిస్తారు. క్రాప్ కటింగ్ ఎక్స్పర్మెంట్ ద్వారా దిగుబడిని నిర్ణయిస్తారు. గత ఐదు సంవత్సరాల సగటు పంటను (త్రెషోల్డ్ యీల్డ్) గా గుర్తించి అందులో నుండి రిస్క్ శాతాన్ని తగ్గిస్తారు. ఐదు సంవత్సరాల సగటుకు సమానంగా గాని ఎక్కువగా గాని దిగుబడి వచ్చినపుడు పరిహారం వర్తించదు. దీనివల్ల ఏరైతుకు బీమా వర్తించలేదు. ఢల్లీి నుండి నేదురుమల్లి జనార్ధన్రెడ్డి కేంద్ర క్యాబినెట్ మంత్రి నాయకత్వాన పరిశీలనకు వచ్చినపుడు రైతులు, రైతు సంఘాలు బీమా పథకాన్ని రైతులకు అనుకూలంగా మార్చాలని కోరారు. ఇది జరిగి 15 సంవత్సరాలు గడుస్తున్నది. అయినప్పటికీ ఎలాంటి మార్పు జరగలేదు.
ప్రీమియంను అనంతరం ఆహార పంటలకు 2శాతం, వాణిజ్య పంటలకు 4శాతంగా నిర్ణయించారు. రుణంపై పైమొత్తం చెల్లించాలి. ప్రీమియం వసూలు నుండి క్లెయిములు ఇచ్చే వరకు కాగితాల పని పూర్తిగా జనరల్ ఇన్య్సూరెన్స్ కంపెనీ చేస్తుంది. అందుకు ప్రతిఫలంగా ప్రీమియం నుండి కొంత తీసుకుంటారు. క్లెయిములకు సంబంధించి నష్టపరిహారం చెల్లింపు రాష్ట్రం 50శాతం, కేంద్రం 50శాతం చెల్లించాలి. అనేక సందర్భాలలో కేంద్రం నిధులు వచ్చినప్పటికీ రాష్ట్రాలు తమ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో క్లెయిముల చెల్లింపులు సంవత్సరాల తరబడి పెండిరగులో ఉన్నాయి. పంటల బీమా పథకాల పరిణామ క్రమం ఈ విధంగా ఉంది. 1. జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ `1972, 2. నేషనల్ అగ్రికల్చరల్ కార్పోరేషన్, 3. రాష్ట్రీయ కృషి బీమా యోజన, 4. అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 5. మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ వీటికి తోడు రాష్ట్రంలో వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం 2008`09లో ప్రారంభించారు. వాతావరణ బీమా కింద చెల్లింపులు ఈ విధంగా ఉన్నాయి.(కోట్లలో)
ఈ పథకం కింద వేరుశనగ బీమాకు ఎకరాకు రు.265.20 పైసలు ప్రీమియం చెల్లించాలి. పథకం ప్రారంభించినప్పటి నుండి ప్రీమియం చెల్లించడమేతప్ప నష్టపోయిన రైతులకు పరిహారం రాలేదు. ముఖ్యంగా ఈ పథకాన్ని రాయలసీమ జిల్లాలలో వేరుశనగపై అమలు చేశారు. ఏటా 15`20 ఎకరాలలో వర్షాభావం వల్ల వేరుశనగ దెబ్బతిన్నప్పటికీ పరిహారం మాత్రం ఏదోకారణాలు చూపి తగ్గించివేశారు.
ప్రస్తుతం అమలు చేయబూనుకున్న మాడిఫైడ్ అగ్రికల్చరల్ నేషనల్ ఇన్సురెన్స్ పథకంలోకి వాతావరణ బీమా పథకం కొబ్బరి తోటల బీమా పథకాన్ని కూడా తెచ్చారు. ఈ మూడు పథకాలను కలిపి ఒకే పథకంగా రూపొందించారు. ప్రీమియంను రుణంపైగాక పంట దిగుబడి అంచనాపై నిర్ణయించారు. ఒక్కో పంటకు 14శాతం వరకు కూడా నిర్ణయించారు. ఫలితంగా ప్రీమియం బాగా పెరిగింది. 31.7.2012 నాటికి ప్రీమియం ఎకరాకు ఈ విధంగా ఉంది.
పత్తి, మిరపకు నీటిపాదుల, నీటిపారుదల లేని వాటికి రెండు ప్రీమియంలు నిర్ణయించారు. రుణం పొందినవారు తప్పనిసరిగా బీమా ప్రీమియం చెల్లించాలి. రుణం పొందనివారికి తప్పనికాదు. సన్న చిన్నకారు రైతులకు 50శాతం ప్రీమియం సబ్సిడీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. మిగిలిన 50శాతం రైతు చెల్లించాలి. ఇన్సురెన్స్ క్లెయిమ్ చేయడానికి ఈ దిగువ సూత్రాన్ని పాటించాలి.
త్రెషోల్డ్ యీల్డ్ ` వాస్తవ దిగుబడి
త్రెషోల్డ్ యీల్డ్
పై సూత్రం ప్రకారం త్రెషోల్ యీల్డ్లో తక్కువ రిస్క్ కింద 10శాతం తగ్గించాలి. మీడియం రిస్క్ అయినచో 20శాతం, హై రిస్క్ అయిన పంటలకు 40శాతం తగ్గించాలి. దీనిని ఇండెమ్నిటీ లెవల్స్ అంటారు. క్రాప్ కటింగ్ ఆధారంగా గత ఐదు సంవత్సరాల సగటు దిగుబడిని తీసుకొని అందులో నుండి వాస్తవ దిగుబడిని తీసివేయాలి. రిస్క్గా ప్రకటించిన ఇండెమ్నిటీ లెవల్స్ తగ్గించాలి. వచ్చిన మొత్తాన్ని ఇన్సూర్ చేసిన మొత్తంతో గుణకారం చేసి త్రెషోల్డ్ యీల్డ్తో భాగహారం చేయాలి. అప్పుడు క్లెయిమ్ మొత్తం వస్తుంది. క్రాప్ కటింగ్ చేసినపుడు మనం తప్పనిసరిగా ఉండాలి. వాతావరణ బీమా కింద వర్షాలు ఆలస్యమైనపుడు పంటవేయనపుడే 25శాతం పరిహారం చెల్లిస్తారు. మద్యలో ప్రకృతి వైపరిత్యాలకు తక్షణ పరిహారం కింద మరో 25శాతం చెల్లిస్తారు. వడగండ్ల వానకు మరియు కల్లాలలో పంటనష్టం జరిగినప్పుడు బీమా క్లెయిమ్స్ చేస్తారు. దీనిని కౌలుదారులకు కూడా వర్తింప చేస్తారు. ఆ విధంగా వర్షబీమా, కొబ్బరి తొటల బీమాను మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సురెన్స్తో జతచేశారు.
ఇతర దేశాలలో ఇలాంటి చిక్కులేవీ ఉండవు. సగటు పంటకు దిగుబడి ఎంత తక్కువ వస్తే దానికి విలువ కట్టి రైతుకు చెల్లిస్తారు. దీనివల్ల ఎలాంటి సమాచారం సేకరించాల్సిన అవసరం ఉండదు. క్రాప్ కటింగ్ ద్వారా సగటు పంటను నిర్ణయిస్తారు. కొత్త పథకం కింద ప్రీమియం ముతకధాన్యలకు దాదాపుగా రు.400, పప్పుధాన్యాలకు రు.200 నుండి 250 వరకు చెల్లించడానికి రైతులు ధౌర్యం చేయడంలేదు. ఒక్కో కొబ్బరి చెట్టుకు రు.14 చొప్పున ప్రీమియం కట్టాలి. ఇందులో 50శాతం కొబ్బరి అభివృద్ధి మండలి చెల్లిస్తుంది. మరో 25శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనిచో ఆ మొత్తాన్ని రైతులే భరించాలి. పంట నష్టాలను అంచనా వేయడానికి ప్రతి 17 కి.మీ లకు నీటి కొలత పరికరాలను పెట్టాలి. కొత్తగా దేశమంతా 5000 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికి ఉన్నవే సరిగా పనిచేయడంలేదు. వేళ్ళమీద లెక్కించగలిన వాళ్ళకు మాత్రమే బీమా సౌకర్యం ఉంది.ఈ బీమా కింద వరి, సన్ఫ్లవర్, వేరుశనగ, మిరప, పెసళ్ళు, మినుములు, మొక్కజొన్న, కందులు మాత్రమే నష్టం జరిగినచో క్లెయిములు వర్తింపచేస్తారు. మిగిలిన పంటలకు వర్తింపచేయరు.
వర్షబీమా :
1. ప్రతి 17 కి.మీలకు ఒక వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. కొలత పరికరాలను పరిశీలించే ఉద్యోగులను నియమించాలి.
2. పంట వేసిన తరువాత 45 రోజులు వర్షం రాకపోతే ఇన్సురెన్స్ చేసినదాంట్లో 50శాతం చెల్లిస్తారు. ఈ తరువాత 45 రోజులకు మిగితా సగం ఇస్తారు.
3. అతి వర్షం పడి నష్టం జరిగితే ప్రాంతాలను బట్టి బీమా నిర్ణయిస్తారు.
4. సన్నచిన్నకారు రైతులకు 2.5శాతం, మిగిలిన రైతులకు 3.5 శాతం ప్రీమియం చెల్లించాలి.
5. వ్యవసాయశాఖ ద్వారాగాని, బ్యాంకుద్వారాగాని ప్రీమియం చెల్లించవచ్చు.
6. దేవాలయ భూముల కౌలుదారులకు కూడా దీనిని వర్తింపచేస్తారు.(మామూలు కౌలుదారులకు వర్తింపచేయరు.)
7. అడంగల్/పహాణి ఒక కాపీని జతపర్చాలి.
ఇవి ప్రస్తుతం రాయలసీమా నాలుగు జిల్లాలోని వేరుశనగ పంటకు మాత్రమే వర్తింపచేశారు.
పై వివరణ పరిశీలించినపుడు లాభాలు ఆశించి కొన్ని ప్రైవేటు కంపెనీలు ఈ రంగంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. వారు ప్రీమియం వసూలు చేయడమే తప్ప ఎలాంటి క్లెయిములు ఇచ్చే అవకాశం లేదు. అందువల్ల రైతులు ప్రీమియం చెల్లించడానికి ముందుకు రావడంలేదు. పథకాన్ని రూపొందించినప్పుడు రైతు ప్రతినిధులతో కాని, కనీసం పార్లమెంటులోని ప్రతినిధులతోగాని లేదా శాసనసభ్యులతోగాని చర్చించకుండా ఇన్సురెన్స్ కంపెనీల లాభాల కొరకు ఈ బీమా పథకం ప్రకటిస్తునారే తప్ప రైతుల ప్రయోజనం కొరకు కాదు. అందువల్ల పంటల బీమా పథకం ప్రయోగాలు నాలుగు దశాబ్దాలు గడిచినా నేటికీ ఏఒక్క పథకం రైతుల ప్రయోజనాన్ని రక్షించలేకపోయింది. వాస్తవానికి ప్రతి రాష్ట్రంలో సగటు దిగుబడి అంచనాలు ఉన్నాయి. ఆ దిగుబడికి ఎంత పంట తగ్గితే రైతువారిగా అతనికి పరిహారం చెల్లించే విధానం ఒక్కటే సరైన మార్గం. ఇది అమెరికా, చైనాల్లో కొనసాగుతున్నది. భారతదేశంలో కూడా దీన్ని వర్తింపచేయాలి.
సారంపల్లి మల్లారెడ్డి
11.05.2014
బీమా చరిత్ర :
1970లో ధర్మనారాయణ కమిటీ పంటల బీమాపై అధ్యయనం చేసింది. అమలు కష్టసాధ్యమని, వ్యక్తిగతంగా అమలుపర్చమని కోరారు. ప్రొ॥దండేకర్ దీన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం 1972లో పంటల బీమా పథకం హెచ్`4 పత్తికి మాత్రమే పరిమితం చేశారు. నాటి నుండి 1999 వరకు ఇది ప్రయోగాత్మకంగా సాగింది.
(ప్రీమియం, క్లెయిములుRలక్షల రూపాయలలో)
మొదట 1985లో గుజరాత్, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు మాత్రమే వర్తింపచేశారు. 1994`99 వరకు 1రూపాయి ప్రీమియం చెల్లిస్తే రు.4 క్లెయిమ్ చేశారు. 2000 సంవత్సరం నుండి జాతీయ పంటల బీమా పథకాన్ని (ఎన్సిఐకి) అమలులోకి తెచ్చారు. ఈ పథకం కింద బీమాదారులకు క్లెయిములు రావడం అనేక చిక్కులతో ముడిపడి ఉంది. పంట నిలువుపై ఉన్నప్పుడు నష్టం జరిగితేనే క్లెయిములు చెల్లిస్తారు. పంట కోసి పొలంలోనే ఉండగా నష్టం జరిగినప్పుడు క్లెయిములు వర్తించవు. పైగా తాలూకా లేదా మండలం యూనిట్గా తీసుకొని నష్టాన్ని లెక్కిస్తారు. క్రాప్ కటింగ్ ఎక్స్పర్మెంట్ ద్వారా దిగుబడిని నిర్ణయిస్తారు. గత ఐదు సంవత్సరాల సగటు పంటను (త్రెషోల్డ్ యీల్డ్) గా గుర్తించి అందులో నుండి రిస్క్ శాతాన్ని తగ్గిస్తారు. ఐదు సంవత్సరాల సగటుకు సమానంగా గాని ఎక్కువగా గాని దిగుబడి వచ్చినపుడు పరిహారం వర్తించదు. దీనివల్ల ఏరైతుకు బీమా వర్తించలేదు. ఢల్లీి నుండి నేదురుమల్లి జనార్ధన్రెడ్డి కేంద్ర క్యాబినెట్ మంత్రి నాయకత్వాన పరిశీలనకు వచ్చినపుడు రైతులు, రైతు సంఘాలు బీమా పథకాన్ని రైతులకు అనుకూలంగా మార్చాలని కోరారు. ఇది జరిగి 15 సంవత్సరాలు గడుస్తున్నది. అయినప్పటికీ ఎలాంటి మార్పు జరగలేదు.
ప్రీమియంను అనంతరం ఆహార పంటలకు 2శాతం, వాణిజ్య పంటలకు 4శాతంగా నిర్ణయించారు. రుణంపై పైమొత్తం చెల్లించాలి. ప్రీమియం వసూలు నుండి క్లెయిములు ఇచ్చే వరకు కాగితాల పని పూర్తిగా జనరల్ ఇన్య్సూరెన్స్ కంపెనీ చేస్తుంది. అందుకు ప్రతిఫలంగా ప్రీమియం నుండి కొంత తీసుకుంటారు. క్లెయిములకు సంబంధించి నష్టపరిహారం చెల్లింపు రాష్ట్రం 50శాతం, కేంద్రం 50శాతం చెల్లించాలి. అనేక సందర్భాలలో కేంద్రం నిధులు వచ్చినప్పటికీ రాష్ట్రాలు తమ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో క్లెయిముల చెల్లింపులు సంవత్సరాల తరబడి పెండిరగులో ఉన్నాయి. పంటల బీమా పథకాల పరిణామ క్రమం ఈ విధంగా ఉంది. 1. జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ `1972, 2. నేషనల్ అగ్రికల్చరల్ కార్పోరేషన్, 3. రాష్ట్రీయ కృషి బీమా యోజన, 4. అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 5. మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ వీటికి తోడు రాష్ట్రంలో వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం 2008`09లో ప్రారంభించారు. వాతావరణ బీమా కింద చెల్లింపులు ఈ విధంగా ఉన్నాయి.(కోట్లలో)
ఈ పథకం కింద వేరుశనగ బీమాకు ఎకరాకు రు.265.20 పైసలు ప్రీమియం చెల్లించాలి. పథకం ప్రారంభించినప్పటి నుండి ప్రీమియం చెల్లించడమేతప్ప నష్టపోయిన రైతులకు పరిహారం రాలేదు. ముఖ్యంగా ఈ పథకాన్ని రాయలసీమ జిల్లాలలో వేరుశనగపై అమలు చేశారు. ఏటా 15`20 ఎకరాలలో వర్షాభావం వల్ల వేరుశనగ దెబ్బతిన్నప్పటికీ పరిహారం మాత్రం ఏదోకారణాలు చూపి తగ్గించివేశారు.
ప్రస్తుతం అమలు చేయబూనుకున్న మాడిఫైడ్ అగ్రికల్చరల్ నేషనల్ ఇన్సురెన్స్ పథకంలోకి వాతావరణ బీమా పథకం కొబ్బరి తోటల బీమా పథకాన్ని కూడా తెచ్చారు. ఈ మూడు పథకాలను కలిపి ఒకే పథకంగా రూపొందించారు. ప్రీమియంను రుణంపైగాక పంట దిగుబడి అంచనాపై నిర్ణయించారు. ఒక్కో పంటకు 14శాతం వరకు కూడా నిర్ణయించారు. ఫలితంగా ప్రీమియం బాగా పెరిగింది. 31.7.2012 నాటికి ప్రీమియం ఎకరాకు ఈ విధంగా ఉంది.
పత్తి, మిరపకు నీటిపాదుల, నీటిపారుదల లేని వాటికి రెండు ప్రీమియంలు నిర్ణయించారు. రుణం పొందినవారు తప్పనిసరిగా బీమా ప్రీమియం చెల్లించాలి. రుణం పొందనివారికి తప్పనికాదు. సన్న చిన్నకారు రైతులకు 50శాతం ప్రీమియం సబ్సిడీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. మిగిలిన 50శాతం రైతు చెల్లించాలి. ఇన్సురెన్స్ క్లెయిమ్ చేయడానికి ఈ దిగువ సూత్రాన్ని పాటించాలి.
త్రెషోల్డ్ యీల్డ్ ` వాస్తవ దిగుబడి
త్రెషోల్డ్ యీల్డ్
పై సూత్రం ప్రకారం త్రెషోల్ యీల్డ్లో తక్కువ రిస్క్ కింద 10శాతం తగ్గించాలి. మీడియం రిస్క్ అయినచో 20శాతం, హై రిస్క్ అయిన పంటలకు 40శాతం తగ్గించాలి. దీనిని ఇండెమ్నిటీ లెవల్స్ అంటారు. క్రాప్ కటింగ్ ఆధారంగా గత ఐదు సంవత్సరాల సగటు దిగుబడిని తీసుకొని అందులో నుండి వాస్తవ దిగుబడిని తీసివేయాలి. రిస్క్గా ప్రకటించిన ఇండెమ్నిటీ లెవల్స్ తగ్గించాలి. వచ్చిన మొత్తాన్ని ఇన్సూర్ చేసిన మొత్తంతో గుణకారం చేసి త్రెషోల్డ్ యీల్డ్తో భాగహారం చేయాలి. అప్పుడు క్లెయిమ్ మొత్తం వస్తుంది. క్రాప్ కటింగ్ చేసినపుడు మనం తప్పనిసరిగా ఉండాలి. వాతావరణ బీమా కింద వర్షాలు ఆలస్యమైనపుడు పంటవేయనపుడే 25శాతం పరిహారం చెల్లిస్తారు. మద్యలో ప్రకృతి వైపరిత్యాలకు తక్షణ పరిహారం కింద మరో 25శాతం చెల్లిస్తారు. వడగండ్ల వానకు మరియు కల్లాలలో పంటనష్టం జరిగినప్పుడు బీమా క్లెయిమ్స్ చేస్తారు. దీనిని కౌలుదారులకు కూడా వర్తింప చేస్తారు. ఆ విధంగా వర్షబీమా, కొబ్బరి తొటల బీమాను మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సురెన్స్తో జతచేశారు.
ఇతర దేశాలలో ఇలాంటి చిక్కులేవీ ఉండవు. సగటు పంటకు దిగుబడి ఎంత తక్కువ వస్తే దానికి విలువ కట్టి రైతుకు చెల్లిస్తారు. దీనివల్ల ఎలాంటి సమాచారం సేకరించాల్సిన అవసరం ఉండదు. క్రాప్ కటింగ్ ద్వారా సగటు పంటను నిర్ణయిస్తారు. కొత్త పథకం కింద ప్రీమియం ముతకధాన్యలకు దాదాపుగా రు.400, పప్పుధాన్యాలకు రు.200 నుండి 250 వరకు చెల్లించడానికి రైతులు ధౌర్యం చేయడంలేదు. ఒక్కో కొబ్బరి చెట్టుకు రు.14 చొప్పున ప్రీమియం కట్టాలి. ఇందులో 50శాతం కొబ్బరి అభివృద్ధి మండలి చెల్లిస్తుంది. మరో 25శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనిచో ఆ మొత్తాన్ని రైతులే భరించాలి. పంట నష్టాలను అంచనా వేయడానికి ప్రతి 17 కి.మీ లకు నీటి కొలత పరికరాలను పెట్టాలి. కొత్తగా దేశమంతా 5000 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికి ఉన్నవే సరిగా పనిచేయడంలేదు. వేళ్ళమీద లెక్కించగలిన వాళ్ళకు మాత్రమే బీమా సౌకర్యం ఉంది.ఈ బీమా కింద వరి, సన్ఫ్లవర్, వేరుశనగ, మిరప, పెసళ్ళు, మినుములు, మొక్కజొన్న, కందులు మాత్రమే నష్టం జరిగినచో క్లెయిములు వర్తింపచేస్తారు. మిగిలిన పంటలకు వర్తింపచేయరు.
వర్షబీమా :
1. ప్రతి 17 కి.మీలకు ఒక వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. కొలత పరికరాలను పరిశీలించే ఉద్యోగులను నియమించాలి.
2. పంట వేసిన తరువాత 45 రోజులు వర్షం రాకపోతే ఇన్సురెన్స్ చేసినదాంట్లో 50శాతం చెల్లిస్తారు. ఈ తరువాత 45 రోజులకు మిగితా సగం ఇస్తారు.
3. అతి వర్షం పడి నష్టం జరిగితే ప్రాంతాలను బట్టి బీమా నిర్ణయిస్తారు.
4. సన్నచిన్నకారు రైతులకు 2.5శాతం, మిగిలిన రైతులకు 3.5 శాతం ప్రీమియం చెల్లించాలి.
5. వ్యవసాయశాఖ ద్వారాగాని, బ్యాంకుద్వారాగాని ప్రీమియం చెల్లించవచ్చు.
6. దేవాలయ భూముల కౌలుదారులకు కూడా దీనిని వర్తింపచేస్తారు.(మామూలు కౌలుదారులకు వర్తింపచేయరు.)
7. అడంగల్/పహాణి ఒక కాపీని జతపర్చాలి.
ఇవి ప్రస్తుతం రాయలసీమా నాలుగు జిల్లాలోని వేరుశనగ పంటకు మాత్రమే వర్తింపచేశారు.
పై వివరణ పరిశీలించినపుడు లాభాలు ఆశించి కొన్ని ప్రైవేటు కంపెనీలు ఈ రంగంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. వారు ప్రీమియం వసూలు చేయడమే తప్ప ఎలాంటి క్లెయిములు ఇచ్చే అవకాశం లేదు. అందువల్ల రైతులు ప్రీమియం చెల్లించడానికి ముందుకు రావడంలేదు. పథకాన్ని రూపొందించినప్పుడు రైతు ప్రతినిధులతో కాని, కనీసం పార్లమెంటులోని ప్రతినిధులతోగాని లేదా శాసనసభ్యులతోగాని చర్చించకుండా ఇన్సురెన్స్ కంపెనీల లాభాల కొరకు ఈ బీమా పథకం ప్రకటిస్తునారే తప్ప రైతుల ప్రయోజనం కొరకు కాదు. అందువల్ల పంటల బీమా పథకం ప్రయోగాలు నాలుగు దశాబ్దాలు గడిచినా నేటికీ ఏఒక్క పథకం రైతుల ప్రయోజనాన్ని రక్షించలేకపోయింది. వాస్తవానికి ప్రతి రాష్ట్రంలో సగటు దిగుబడి అంచనాలు ఉన్నాయి. ఆ దిగుబడికి ఎంత పంట తగ్గితే రైతువారిగా అతనికి పరిహారం చెల్లించే విధానం ఒక్కటే సరైన మార్గం. ఇది అమెరికా, చైనాల్లో కొనసాగుతున్నది. భారతదేశంలో కూడా దీన్ని వర్తింపచేయాలి.
సారంపల్లి మల్లారెడ్డి
11.05.2014
Wednesday, 13 August 2014
వ్యవసాయ ప్రణాళిక ` 2014
(1) భూ సమస్యలు
(1) భూముల రీసర్వే సెటిల్మెంట్ చేసి వాస్తవ సాగుదారులకు హక్కు కల్పించాలి. రికార్డుల్లో నమోదు చేయాలి.
(2) సాగులో ఉన్నవారికి అర్హతను బట్టి పట్టాలు ఇవ్వాలి.
(3) దళిత`గిరిజనుల భూములను సాగుకు యోగ్యంగా మార్చడానికి ‘‘చదును చేత’’ పేర నిధి కేటాయించాలి.
(4) అటవీ హక్కుల చట్టాన్ని చట్ట ప్రకారం గిరిజనులకు కుటుంబానికి 10 ఎకరాల భూమిని ఇవ్వాలి. ఇంత వరకు ఆంధ్రప్రదేశ్లో 4,77,315 ఎకరాల భూమిని మాత్రమే పంపిణీ చేసినా వారికి హక్కు పత్రాలు ఇవ్వడమే తప్ప భూమి చూపలేదు.
(5) ప్రభుత్వ భూములను దళిత`గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి. భార్యా`భర్తల పేరుతో జాయింట్ పట్టాల విధానాన్ని అమలు చేయాలి.
(6) ‘‘భూ వినియోగ కమిటీ’’ రాష్ట్ర`జిల్లా`మండల స్థాయిల్లో ఏర్పాటు చేయాలి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకుండా ప్రస్తుతం ఉన్న చట్టాన్ని అమలు చేయాలి.
(2) కౌలు రైతులు:
(1) ప్రస్తుత చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు జరపాలి.
(2) కౌలుదారుల పేర్లు రికార్డుల్లో నమోదు చేయాలి.
(3) వ్యవసాయ అధికారులు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ సంస్థలు కౌలుదారుల హక్కుల అమలులో నిర్లక్ష్యం చేసినచో వారిపై చర్యలు తీసుకోవాలి.
(4) కౌలుదారుల నమోదుకు రెవెన్యూ అధికారులను ఎకౌంటబులిటీ చేయాలి. చట్టంలో నిర్దేశించిన సౌకర్యాలు కౌలుదారులకు కల్పించాలి.
(3) సాగునీటి వసతులు:
(1) భారీ ప్రాజెక్టులను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి. మధ్యతరహా ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యతనివ్వాలి. ఆదిలాబాదు, ఖమ్మం జిల్లాల్లోని మధ్యతరహా ప్రాజెక్టులను రెండు సంవత్సరాల్లో పూర్తిచేయాలి. ‘‘రాష్ట్ర జల విధానాన్ని’’ రూపొందించాలి.
(2) లిఫ్ట్ పథకాలకు 12 గంటల నాణ్యతగల విద్యుత్ను సరఫరా చేయాలి. ఐడిసి (ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పెరేషన్) ద్వారా లిప్టు పథకాలను మరియు విద్యుత్ పంపు సెట్ల పథకాలను నిర్వహించాలి.
(3) మైనర్ ఇరిగేషన్ (చెరువు`కుంటలు) రిపేర్లు పూర్తిచేయాలి. దురాక్రమణకు గురైన చెరువు `కుంటలను రికవరీ చేసి రిపేర్లు చేపట్టాలి. ఆ విధంగా భూగర్భ జలాలు పెరుగుతాయి.
(4) వ్యవసాయ పంపుసెట్లకు 9గంటల విద్యుత్ సరఫరాను గ్యారెంటీ చేయాలి.
చెరువుల ఆయకట్టు
తెలంగాణ రాష్ట్రం
100 ఎకరాలపైబడి 100 ఎకరాలలోబడి మొత్తం
తెలంగాణలో 35,432 చెరువుల కింద 16,75,735 ఎకరాలు సాగు కావలసి ఉండగా 2011`12లో 4,50,903 ఎకకాలు మాత్రమే సాగయ్యింది. క్రమంగా చెరువులు నిర్మూలించబడుతున్నాయి. ఫలితంగా బావుల సేద్యం పెరుగుతన్నది.
(4) రుణాలు:
(1) అర్హతగల వారందరికీ సంస్థాగత రుణాలు ఇవ్వాలి.
(2) 1938 రుణ విమోచన చట్టాన్ని అమలు చేయాలి (అసలుకు సమానమైన వడ్డీ చెల్లించినచో రుణ విముక్తిన్ని చేయాలి).
(3) ప్రయివేటు రుణాలను నియంత్రించాలి.
(4) సహకార వ్యవస్థను పటిష్ట పరిచి ప్రతి 3000 మంది సభ్యులకు ఒక సొసైటీని వికేంద్రీకరించాలి.
(5) భూమిలేని గ్రామీణులతో సహకార వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయాలి.
(6) ప్రకృతి వైఫరిత్యాలు సంభవించినప్పుడు రుణ వాయిదాలకు అవకాశం ఉండాలి.
(7) వడ్డీలేని వ్యవసాయ రుణాలు ఇవ్వాలి.
(5) ఎరువులు` క్రిమి సంహారక మందులు:
(1) ఎరువులు`క్రిమిసంహారక మందులపై వ్యవసాయ శాఖ నియంత్రణ ఉండాలి.
(2) తగినన్ని ఎరువులను అందుబాటులో పెట్టాలి.
(3) ఒక హెక్టారులోపు గల రైతులకు ఎరువులు పూర్తి సబ్సిడీపై ఇవ్వాలి.
(4) మిక్సింగ్ ప్లాంట్లను రద్దు చేయాలి.
(5) రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీని పెంచాలి.
(6) విత్తనాలు:
(1) విత్తన రంగం నుండి బహుళజాతి సంస్థలను తొలగించాలి.
(2) ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న పరిశోధనా కేంద్రాల్లో విత్తన ప్రయోగాలు చేపట్టాలి.
(3) తెలంగాణాలోని ప్రతి జిల్లాలో పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. వాటిని పునరుద్ధరించి ప్రయోగాలు ప్రారంభించాలి.
(4) ఇక్రిసాట్ ప్రయోగాలు తెలంగాణా రైతులకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలి.
(5) విత్తనోత్పత్తి చేస్తున్న రైతులను ప్రోత్సహించి, విత్తన కంపెనీల నుండి రక్షణ కల్పించాలి.
(6) రాష్ట్రం నుండి విత్తన ఎగుమతికి గల అవకాశాలను పరిశీలించాలి.
(8) విస్తరణ:
(1) వ్యవసాయ శాఖ ప్రతి 1000 కుటుంబాలకు లేదా 3 గ్రామాలకు ఒక అధికారిని నియమించాలి.
(2) భూసార పరీక్షలు జరిపి విత్తనాలు, ఎరువులు ఎలా వాడాలో రైతులకు తెలియపర్చాలి.
(3) బహుళ పంటలను ప్రోత్సహించాలి.
(4) క్రిమి కీటకాదుల దాడులు జరిగినచో ప్రభుత్వమే నివారణా చర్యలు చేపట్టాలి.
(5) ప్రతి గ్రామపంచాయితీ సమావేశాలకు వ్యవసాయాధికారి హాజరు కావాలి.
(6) ప్రభుత్వ విత్తనోత్పత్తి కేంద్రాలను నిర్వహించాలి.
(7) మండలాన్ని నాల్గు జోన్స్గా చేసి ప్రతి జోన్ కేంద్రంలో చిన్న యంత్రాలు అద్దె, కొనుగోలు పద్దతిపై సన్న`చిన్నకారు రైతులకు అందించాలి. భారీ యంత్రాలకు బదులు చిన్న యంత్రాలను విరివిగా ప్రవేశపెట్టాలి.
(8) ఆదర్శరైతుల వ్యవస్థను రద్దు పరచి వ్యవసాయ పట్టభద్రులను నియమించాలి.
(9) మార్కెట్:
(1) మార్కెట్ పరిధిలో రైతుల సభ్యత్వాలను నమోదు చేసి మార్కెట్ కమిటీలను ఎన్నికల ద్వారా ఎన్నుకోవాలి.
(2) మార్కెట్ యార్డుల్లో సరుకుల నిల్వకు కోల్డ్ స్టోరేజీలను, గోదాములను నిర్మించాలి.
(3) రైతుబంధు పథకాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలి (ప్రస్తుతం ఈ పథకం క్రింద వ్యాపారుల సరుకులకు రుణాలు ఇస్తున్నారు).
(4) విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు మార్కెట్ కమిటీల ద్వారా అమ్మించాలి.
(5) మార్కెట్ కమిటీలు రైతులకు శిక్షణ చేపట్టాలి.
(10) ఎగుమతి`దిగుమతులు:
(1) మన రాష్ట్రంలో జరుగు మిగులు ఉత్పత్తులను ఇతర ప్రాంతాలనుండి దిగుమతులు చేసుకోవడం నియంత్రించాలి.
(2) మన మిగులు ఉత్పత్తులను అవసరమైన చోటికి ఎగుమతి చేసే బాధ్యతను రాష్ట్ర మార్కెటింగ్ కమిటీ చేపట్టాలి.
(3) వ్యవసాయ ఉత్పత్తులను గ్రేడిరగ్ చేసి ఎగుమతులకు అనుకూలంగా తయారు చేసి అమ్మించాలి.
(11) పకృతి వైఫరిత్యాలు:
(1) రాష్ట్రంలో కరువులు యేటా వస్తున్నాయి. కరువుల నివారణకు ‘‘రాష్ట్ర జల విధానం’’ను రూపొందించాలి (ప్రాజెక్టుల నుండి చెరువులు నింపడం ద్వారా భూగర్భ జలాల అభివృద్దితో పాటు, చెరువుల వెనుక ఒక పంట గ్యారెంటీ ఉంటుంది).
(2) ప్రకృతి వైఫరిత్యాల నిధిని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుండి కేటాయించాలి.
(3) పంటలు నష్టపోయి ఏ రైతు నిరాశ`నిస్పృహలకు గురై ఆత్మహత్యకు పాల్పడకుండా చూడాలి.
(12) వ్యవసాయ బడ్జెట్ :
(1) విత్తన, ఎరువులు, క్రమి సంహారక మందుల సబ్సిడీ ` వ్యవసాయ విస్తరణ వ్యయం, పరిశోధనలు ` సాగునీటి వనరుల నిర్మాణం, రిపేర్లు (మేజర్, మిడియం, మైనర్, లిఫ్ట్, పంపుసెట్ల సబ్సిడీ) ` మార్కెట్ జోక్యం పథకం క్రింద 5000 కోట్లు ` రైతుల ఆత్మహత్యలకు ఎక్స్గ్రేషియో ` రైతుల వృద్ధాప్య పెన్షన్లు, ప్రకృతి వైఫరిత్యాల పరిహారం, హార్టీకల్చర్ అభివృద్ది ` పాడిపరిశ్రమ, వ్యవసాయ ఆధారిత వృత్తులకు సహకారం ... వీటికి కావాల్సిన నిధులను బడ్జెట్ నుండి కేటాయించాలి.
(13) అఖిలపక్ష కమిటీలు:
(1) రాష్ట్ర`జిల్లా`మండల స్థాయిల్లో రైతులతో అఖిలపక్ష కమిటీలను వేయాలి.
(2) విద్యుత్ సబ్స్టేషన్ వారీగా అఖిలపక్ష కమిటీ వేయాలి.
(3) ప్రభుత్వ పథకాల అమలుకు, లాభోక్తల ఎంపికకు గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎన్నుకోవాలి.
(14) పస్తుత బడ్జెట్ ఈ విధంగా ఉంది :
ఈ పట్టికను గమనిస్తే బడ్జెట్ కేటాయింపులు ఎంత భారీగా చేసి తీరా వాస్తవ వ్యయం ఎలా తగ్గిందో తెలుసుకోవచ్చు. (మొత్తం రాష్ట్ర బడ్జెట్ కోట్లలో)
మొత్తం రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ ప్రణాళికేతర, ప్రణాళిక బడ్జెట్ 3.5శాతం మించలేదు. ఈ బడ్జెట్లో రాష్ట్ర వ్యవసాయ అభివృద్ది అయ్యేనా? కేంద్రం ఆర్కేవివై క్రింద చేసిన కేటాయింపులు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. బడ్జెట్లో 10 శాతం కేటాయించాలి. విడిగా బడ్జెట్ ఉండాలి.
అందుకే ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ వ్యవసాయ విధానాలను సంస్కరించాలి. సంస్కరణల పేరుతో రైతులను భూముల నుండి వెళ్ళగొట్టడం లేదా ఆత్మహత్యలకు పాల్పడేవిధంగా పరిస్థితులను సృష్టించడం చేస్తున్న ప్రభుత్వాలు కార్పోరేట్ అనుకూల విధానాలను పూర్తిగా మార్చాలి. సన్న,చిన్నకారు రైతులకు వ్యవసాయంపై ఆదాయం పెరిగే విధంగా చూడాలి. వ్యవసాయోపకరణాల ధరలకు, పంటల ధరలకు మధ్య సమతూకం ఉండాలి. రైతుల కుటుంబ శ్రమకు తగిన ప్రతిఫలం అందేవిధంగా ధరలు నిర్ణయించాలి. వ్యవసాయోపకరణాలను పూర్తి సబ్సిడీపై రైతులకు అందజేసినప్పుడు ఆహారధాన్యాల ధరలు తగ్గుముఖంలో ఉంటాయి. ఒకవైపున ఉపకరణాల ధరలు పెంచుతూ మరోవైపున పంటలు ధరలు తగ్గిస్తూ రైతులకు హాని కల్గించే విధానాలను విడనాడాలి.
(1) భూముల రీసర్వే సెటిల్మెంట్ చేసి వాస్తవ సాగుదారులకు హక్కు కల్పించాలి. రికార్డుల్లో నమోదు చేయాలి.
(2) సాగులో ఉన్నవారికి అర్హతను బట్టి పట్టాలు ఇవ్వాలి.
(3) దళిత`గిరిజనుల భూములను సాగుకు యోగ్యంగా మార్చడానికి ‘‘చదును చేత’’ పేర నిధి కేటాయించాలి.
(4) అటవీ హక్కుల చట్టాన్ని చట్ట ప్రకారం గిరిజనులకు కుటుంబానికి 10 ఎకరాల భూమిని ఇవ్వాలి. ఇంత వరకు ఆంధ్రప్రదేశ్లో 4,77,315 ఎకరాల భూమిని మాత్రమే పంపిణీ చేసినా వారికి హక్కు పత్రాలు ఇవ్వడమే తప్ప భూమి చూపలేదు.
(5) ప్రభుత్వ భూములను దళిత`గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి. భార్యా`భర్తల పేరుతో జాయింట్ పట్టాల విధానాన్ని అమలు చేయాలి.
(6) ‘‘భూ వినియోగ కమిటీ’’ రాష్ట్ర`జిల్లా`మండల స్థాయిల్లో ఏర్పాటు చేయాలి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకుండా ప్రస్తుతం ఉన్న చట్టాన్ని అమలు చేయాలి.
(2) కౌలు రైతులు:
(1) ప్రస్తుత చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు జరపాలి.
(2) కౌలుదారుల పేర్లు రికార్డుల్లో నమోదు చేయాలి.
(3) వ్యవసాయ అధికారులు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ సంస్థలు కౌలుదారుల హక్కుల అమలులో నిర్లక్ష్యం చేసినచో వారిపై చర్యలు తీసుకోవాలి.
(4) కౌలుదారుల నమోదుకు రెవెన్యూ అధికారులను ఎకౌంటబులిటీ చేయాలి. చట్టంలో నిర్దేశించిన సౌకర్యాలు కౌలుదారులకు కల్పించాలి.
(3) సాగునీటి వసతులు:
(1) భారీ ప్రాజెక్టులను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి. మధ్యతరహా ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యతనివ్వాలి. ఆదిలాబాదు, ఖమ్మం జిల్లాల్లోని మధ్యతరహా ప్రాజెక్టులను రెండు సంవత్సరాల్లో పూర్తిచేయాలి. ‘‘రాష్ట్ర జల విధానాన్ని’’ రూపొందించాలి.
(2) లిఫ్ట్ పథకాలకు 12 గంటల నాణ్యతగల విద్యుత్ను సరఫరా చేయాలి. ఐడిసి (ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పెరేషన్) ద్వారా లిప్టు పథకాలను మరియు విద్యుత్ పంపు సెట్ల పథకాలను నిర్వహించాలి.
(3) మైనర్ ఇరిగేషన్ (చెరువు`కుంటలు) రిపేర్లు పూర్తిచేయాలి. దురాక్రమణకు గురైన చెరువు `కుంటలను రికవరీ చేసి రిపేర్లు చేపట్టాలి. ఆ విధంగా భూగర్భ జలాలు పెరుగుతాయి.
(4) వ్యవసాయ పంపుసెట్లకు 9గంటల విద్యుత్ సరఫరాను గ్యారెంటీ చేయాలి.
చెరువుల ఆయకట్టు
తెలంగాణ రాష్ట్రం
100 ఎకరాలపైబడి 100 ఎకరాలలోబడి మొత్తం
తెలంగాణలో 35,432 చెరువుల కింద 16,75,735 ఎకరాలు సాగు కావలసి ఉండగా 2011`12లో 4,50,903 ఎకకాలు మాత్రమే సాగయ్యింది. క్రమంగా చెరువులు నిర్మూలించబడుతున్నాయి. ఫలితంగా బావుల సేద్యం పెరుగుతన్నది.
(4) రుణాలు:
(1) అర్హతగల వారందరికీ సంస్థాగత రుణాలు ఇవ్వాలి.
(2) 1938 రుణ విమోచన చట్టాన్ని అమలు చేయాలి (అసలుకు సమానమైన వడ్డీ చెల్లించినచో రుణ విముక్తిన్ని చేయాలి).
(3) ప్రయివేటు రుణాలను నియంత్రించాలి.
(4) సహకార వ్యవస్థను పటిష్ట పరిచి ప్రతి 3000 మంది సభ్యులకు ఒక సొసైటీని వికేంద్రీకరించాలి.
(5) భూమిలేని గ్రామీణులతో సహకార వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయాలి.
(6) ప్రకృతి వైఫరిత్యాలు సంభవించినప్పుడు రుణ వాయిదాలకు అవకాశం ఉండాలి.
(7) వడ్డీలేని వ్యవసాయ రుణాలు ఇవ్వాలి.
(5) ఎరువులు` క్రిమి సంహారక మందులు:
(1) ఎరువులు`క్రిమిసంహారక మందులపై వ్యవసాయ శాఖ నియంత్రణ ఉండాలి.
(2) తగినన్ని ఎరువులను అందుబాటులో పెట్టాలి.
(3) ఒక హెక్టారులోపు గల రైతులకు ఎరువులు పూర్తి సబ్సిడీపై ఇవ్వాలి.
(4) మిక్సింగ్ ప్లాంట్లను రద్దు చేయాలి.
(5) రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీని పెంచాలి.
(6) విత్తనాలు:
(1) విత్తన రంగం నుండి బహుళజాతి సంస్థలను తొలగించాలి.
(2) ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న పరిశోధనా కేంద్రాల్లో విత్తన ప్రయోగాలు చేపట్టాలి.
(3) తెలంగాణాలోని ప్రతి జిల్లాలో పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. వాటిని పునరుద్ధరించి ప్రయోగాలు ప్రారంభించాలి.
(4) ఇక్రిసాట్ ప్రయోగాలు తెలంగాణా రైతులకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలి.
(5) విత్తనోత్పత్తి చేస్తున్న రైతులను ప్రోత్సహించి, విత్తన కంపెనీల నుండి రక్షణ కల్పించాలి.
(6) రాష్ట్రం నుండి విత్తన ఎగుమతికి గల అవకాశాలను పరిశీలించాలి.
(8) విస్తరణ:
(1) వ్యవసాయ శాఖ ప్రతి 1000 కుటుంబాలకు లేదా 3 గ్రామాలకు ఒక అధికారిని నియమించాలి.
(2) భూసార పరీక్షలు జరిపి విత్తనాలు, ఎరువులు ఎలా వాడాలో రైతులకు తెలియపర్చాలి.
(3) బహుళ పంటలను ప్రోత్సహించాలి.
(4) క్రిమి కీటకాదుల దాడులు జరిగినచో ప్రభుత్వమే నివారణా చర్యలు చేపట్టాలి.
(5) ప్రతి గ్రామపంచాయితీ సమావేశాలకు వ్యవసాయాధికారి హాజరు కావాలి.
(6) ప్రభుత్వ విత్తనోత్పత్తి కేంద్రాలను నిర్వహించాలి.
(7) మండలాన్ని నాల్గు జోన్స్గా చేసి ప్రతి జోన్ కేంద్రంలో చిన్న యంత్రాలు అద్దె, కొనుగోలు పద్దతిపై సన్న`చిన్నకారు రైతులకు అందించాలి. భారీ యంత్రాలకు బదులు చిన్న యంత్రాలను విరివిగా ప్రవేశపెట్టాలి.
(8) ఆదర్శరైతుల వ్యవస్థను రద్దు పరచి వ్యవసాయ పట్టభద్రులను నియమించాలి.
(9) మార్కెట్:
(1) మార్కెట్ పరిధిలో రైతుల సభ్యత్వాలను నమోదు చేసి మార్కెట్ కమిటీలను ఎన్నికల ద్వారా ఎన్నుకోవాలి.
(2) మార్కెట్ యార్డుల్లో సరుకుల నిల్వకు కోల్డ్ స్టోరేజీలను, గోదాములను నిర్మించాలి.
(3) రైతుబంధు పథకాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలి (ప్రస్తుతం ఈ పథకం క్రింద వ్యాపారుల సరుకులకు రుణాలు ఇస్తున్నారు).
(4) విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు మార్కెట్ కమిటీల ద్వారా అమ్మించాలి.
(5) మార్కెట్ కమిటీలు రైతులకు శిక్షణ చేపట్టాలి.
(10) ఎగుమతి`దిగుమతులు:
(1) మన రాష్ట్రంలో జరుగు మిగులు ఉత్పత్తులను ఇతర ప్రాంతాలనుండి దిగుమతులు చేసుకోవడం నియంత్రించాలి.
(2) మన మిగులు ఉత్పత్తులను అవసరమైన చోటికి ఎగుమతి చేసే బాధ్యతను రాష్ట్ర మార్కెటింగ్ కమిటీ చేపట్టాలి.
(3) వ్యవసాయ ఉత్పత్తులను గ్రేడిరగ్ చేసి ఎగుమతులకు అనుకూలంగా తయారు చేసి అమ్మించాలి.
(11) పకృతి వైఫరిత్యాలు:
(1) రాష్ట్రంలో కరువులు యేటా వస్తున్నాయి. కరువుల నివారణకు ‘‘రాష్ట్ర జల విధానం’’ను రూపొందించాలి (ప్రాజెక్టుల నుండి చెరువులు నింపడం ద్వారా భూగర్భ జలాల అభివృద్దితో పాటు, చెరువుల వెనుక ఒక పంట గ్యారెంటీ ఉంటుంది).
(2) ప్రకృతి వైఫరిత్యాల నిధిని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుండి కేటాయించాలి.
(3) పంటలు నష్టపోయి ఏ రైతు నిరాశ`నిస్పృహలకు గురై ఆత్మహత్యకు పాల్పడకుండా చూడాలి.
(12) వ్యవసాయ బడ్జెట్ :
(1) విత్తన, ఎరువులు, క్రమి సంహారక మందుల సబ్సిడీ ` వ్యవసాయ విస్తరణ వ్యయం, పరిశోధనలు ` సాగునీటి వనరుల నిర్మాణం, రిపేర్లు (మేజర్, మిడియం, మైనర్, లిఫ్ట్, పంపుసెట్ల సబ్సిడీ) ` మార్కెట్ జోక్యం పథకం క్రింద 5000 కోట్లు ` రైతుల ఆత్మహత్యలకు ఎక్స్గ్రేషియో ` రైతుల వృద్ధాప్య పెన్షన్లు, ప్రకృతి వైఫరిత్యాల పరిహారం, హార్టీకల్చర్ అభివృద్ది ` పాడిపరిశ్రమ, వ్యవసాయ ఆధారిత వృత్తులకు సహకారం ... వీటికి కావాల్సిన నిధులను బడ్జెట్ నుండి కేటాయించాలి.
(13) అఖిలపక్ష కమిటీలు:
(1) రాష్ట్ర`జిల్లా`మండల స్థాయిల్లో రైతులతో అఖిలపక్ష కమిటీలను వేయాలి.
(2) విద్యుత్ సబ్స్టేషన్ వారీగా అఖిలపక్ష కమిటీ వేయాలి.
(3) ప్రభుత్వ పథకాల అమలుకు, లాభోక్తల ఎంపికకు గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎన్నుకోవాలి.
(14) పస్తుత బడ్జెట్ ఈ విధంగా ఉంది :
ఈ పట్టికను గమనిస్తే బడ్జెట్ కేటాయింపులు ఎంత భారీగా చేసి తీరా వాస్తవ వ్యయం ఎలా తగ్గిందో తెలుసుకోవచ్చు. (మొత్తం రాష్ట్ర బడ్జెట్ కోట్లలో)
మొత్తం రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ ప్రణాళికేతర, ప్రణాళిక బడ్జెట్ 3.5శాతం మించలేదు. ఈ బడ్జెట్లో రాష్ట్ర వ్యవసాయ అభివృద్ది అయ్యేనా? కేంద్రం ఆర్కేవివై క్రింద చేసిన కేటాయింపులు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. బడ్జెట్లో 10 శాతం కేటాయించాలి. విడిగా బడ్జెట్ ఉండాలి.
అందుకే ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ వ్యవసాయ విధానాలను సంస్కరించాలి. సంస్కరణల పేరుతో రైతులను భూముల నుండి వెళ్ళగొట్టడం లేదా ఆత్మహత్యలకు పాల్పడేవిధంగా పరిస్థితులను సృష్టించడం చేస్తున్న ప్రభుత్వాలు కార్పోరేట్ అనుకూల విధానాలను పూర్తిగా మార్చాలి. సన్న,చిన్నకారు రైతులకు వ్యవసాయంపై ఆదాయం పెరిగే విధంగా చూడాలి. వ్యవసాయోపకరణాల ధరలకు, పంటల ధరలకు మధ్య సమతూకం ఉండాలి. రైతుల కుటుంబ శ్రమకు తగిన ప్రతిఫలం అందేవిధంగా ధరలు నిర్ణయించాలి. వ్యవసాయోపకరణాలను పూర్తి సబ్సిడీపై రైతులకు అందజేసినప్పుడు ఆహారధాన్యాల ధరలు తగ్గుముఖంలో ఉంటాయి. ఒకవైపున ఉపకరణాల ధరలు పెంచుతూ మరోవైపున పంటలు ధరలు తగ్గిస్తూ రైతులకు హాని కల్గించే విధానాలను విడనాడాలి.
Subscribe to:
Posts (Atom)









