Thursday, 14 August 2014

2014`15 కేంద్రబడ్జెట్‌ వ్యవసాయాభివృద్ధికి తోడ్పడుతుందా.?

2014`15 సంవత్సరానికి ఆర్థిక మంత్రి చిదంబరం 20 ఫిబ్రవరి 2014న లోక్‌సభలో ఓట్‌ఆన్‌ అక్కౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. గత సంవత్సరం బడ్జెట్‌ రూ.15,90,434 కోట్లు కాగా రూ. 2014`15 బడ్జెట్‌ను రూ. 17,63,214 కోట్లకు పెంచి పార్లమెంట్‌లో ప్రకటించారు. ఇందులో వ్యవసాయ రంగానికి ప్రణాళికా బడ్జెట్‌ క్రింద రూ. 21,609కోట్లు, పరిశోదనలకు రూ. 3,415 కోట్లు, పశు సంవర్థనకు రూ.2,074 కోట్లు కలిపి మొత్తం రూ. 27,098కోట్లు చూపారు. గత సంవత్సరంపై రూ. 3,616 కోట్లు అదనంగా చూపారు. ప్రణాళికేతర బడ్జెట్‌గా రూ. 2865 కోట్లు చూపారు. ప్రణాళికా బడ్జెట్‌లో వ్యవసాయ ప్రణాళికా బడ్జెట్‌ 4.88 శాతంగా వుంది. మొత్తం బడ్జెట్‌ను పరిశీలించినప్పుడు మొత్తం బడ్జెట్‌లో వ్యవసాయ బడ్జెట్‌లో వ్యవసాయ బడ్జెట్‌ 1.70 శాతం మాత్రమే. గత సంవత్సరంపై బడ్జెట్‌ పెరిగినా గత సంవత్సరం కేటాయించిన శాతం కంటే తక్కువే. అందువల్ల వ్యవసాయ రంగం వృద్ధిరేటు కూడా తగ్గుతూనే ఉంది.
వ్యవసాయ గ్రోత్‌రేటు (2004`05సంవత్సర ధరల ప్రకారం)
2010`11         8.9 శాతం
2011`12        6.7 శాతం
2012`13        4.5 శాతం
2013`14        4.9 శాతం
ఉత్పత్తి తగ్గుతునప్పటికి ప్రాధాన్యతా రంగానికి నిధులు కేటాయించడానికి సుంకంగా లేదు. ఆహార దాన్యాల ఉత్పత్తి 2011`12లో 25.93 కోట్ల టన్నులు కాగా 2012`13లో 25.54కోట్ల టన్నులకు తగ్గింది. సహాకార రుణాలు పెద్దఎత్తున పెంచుతున్నట్టు ప్రకటించారు. కానీ వాస్తవ సాగు దార్లకు రుణాలు అందటం లేదు. వ్యవసాయ అవసరాల పేర బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొంది ఇతర వ్యాపారాలకు మళ్ళించిన వారి రుణాలు, కోల్డ్‌ స్టోరేజీలకు, భారీ యంత్రాలకు (హార్‌వెస్టర్స్‌)కు, భూమి సాగు చేయని భూ యజమానులు తీసుకున్న రుణాలను వ్యవసాయ రుణాలుగా పరిగణిస్తున్నారు. వాస్తవానికి బ్యాంకులిచ్చిన వ్యవసాయ రుణాలలో 50శాతం కూడా వాస్తవ సాగు దార్లకు చేరడంలేదు.
రుణ పంపిణీ ఈ విధంగా ఉంది రూ. కోట్లలో
2003`04        86,981
2011`12        5,11,029
2012`13        6,07,375
2013`14        7,35,000
2014`15 సంవత్సరానికి గతం కన్నా తక్కువగా 7 లక్షల కోట్ల లక్ష్యాన్ని నిర్ణయించింది. 2013`14 సంవత్సరానికి ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంపుదల చేస్తూ 25.54కోట్ల టన్నుల నుండి 25.30 కోట్ల టన్నులకు పెరుగు తుందని అంచనా వేసారు రబ్బీ పంట ఇంకా చేతికి రావలసి ఉంది. 2013`14లో వ్యవసాయ ఎగుమతులు 41 బిలియన్‌ డాలర్లకు చేరుతాయని దిగుమతులు 20 బిలియన్‌ డాలర్లు ఆర్థిక సర్వేలో సూచించారు. వ్యవసాయ గ్రోత్‌రేటు జిడిపిలో 3.1 శాతంగా ఉంటుందని దీనిని నాలుగు శాతానికి పెంచడానికి ప్రయత్నిస్తామని ఆర్థిక మంత్రి చిదంబంరం తన బడ్జెట్‌ ప్రసంగంలో వివరించారు.


ఈ నిధులతో వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదక పెరుగుతుందా.? 2013`14లో కేంద్రం రాష్ట్రాలకు రూ.11,911కోట్లు కేటాయించగా 2014`15 సంవత్సరం రూ. 4,321కోట్లు మాత్రమే కేటాయించడాన్ని బట్టి చూస్తే వ్యవసాయంపై కేంద్రానికున్న శ్రద్ధ కనబడుతుంది. ముఖ్యంగా పరిశోధనలకు రానురానూ నిధులు తగ్గుతున్నాయి. 2014`15కు రూ. 3,415కోట్లు మాత్రమే కేటాయించారు. ఒక్క ఆంద్రప్రదేశ్‌లోనే 27 పరిశోధనా కేంద్రాలక్రింద 5,030 ఎకరాల భూమి ఉంది. 2005నుండి క్రమంగా వ్యవసాయ పరిశోధనలు తగ్గుతూ నేడు పూర్తిగా ఆపివేసారు. విదేశీ టెక్నాలజీని దిగుమతి చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మన్‌సాంటో, డూపాయింట్‌, కార్గిల్‌, సింజెంటా లాంటి కంపెణీల పరిశోధనలపై మన ప్రభుత్వాలు ఆధారపడే దుస్థితికి నెట్టబడ్డాయి. హరిత విప్లవంలో ఐదు రెట్లు ఆహార దాన్యాల ఉత్పత్తిని పెంచి దేశాన్ని స్వయం పోషకత్వంలోకి తెచ్చిన వ్యవసాయ విధానాలు సరళీకరించి 2005 నుండి దిగుమతులపై ఆధారపడే పరిస్థితికి నెట్టారు. ధనిక దేశాలు తమ ఆహార దాన్యాలను మనకు అవసరం ఉన్నాలేకున్నా దిగుమతులు చేస్తూనే ఉన్నారు. వంట నూనెలు, పంచదార, పత్తి, పట్టు, ఉత్పత్తులను పెద్ద ఎత్తున దిగుమతి చేస్తున్నారు. వారికి అనుకూలంగా దిగుమతి సుంకాలను కూడా పూర్తిగా రద్ధు చేసారు.
 దేశంలోకి వంటనూనెల దిగుమతులు ఇలా ఉన్నాయి. (దిగుమతులు, ఉత్పత్తి : లక్షల టన్నులలో, విలువ : కోట్ల రూపాయలలో)


దేశంలో నూనె గింజల ఉత్పత్తికి అవకాశాలున్నప్పటికీ అందుకు తగిన నిధుల కేటాయించక పోవడం వల్ల ఉత్పత్తిలో తగినంత సాధించలేక పోయాం. మన దేశీయ ఉత్పత్తి ఈ విధంగా ఉంది.
కొన్ని నూనెగింజల పంటల పరిస్థితి ఈ దిగువ విధంగా ఉంది. (లక్షల టన్నులలో)


రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సోయా పంటకు మంచి అవకాశాలున్నాయి. ప్రస్తుతం పత్తి, మిరప పంటల వల్ల నష్టపోతున్న రైతులకు సోయా ఉత్పత్తి ఆశాజనకంగా ఉంటుంది. ఎకరాకు అతితక్కువ 8 క్వింటాళ్ళ నుండి 13 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. కనీస మద్దతు ధర రు.4500 ఉండాలి. అయినప్పటికీ కిలో నూనె రు.50లకు అమ్మవచ్చు. పెట్టుబడిపోగా ఎకరాకు రు.20వేలు గిట్టుబాటు అవుతుంది. ఇటు వినియోగదారులకు అటు ఉత్పత్తిదారులకు లాభదాయకంగా ఉంటుంది. గత సంవత్సరం మెదక్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలలో సోయా వేయడానికి రైతులు ముందుకు వచ్చినా కనీసం విత్తన సరఫరా చేయలేకపోయింది. చైనా, అమెరికాల్లో సోయా ఉత్పత్తి అత్యంత కీలకమైంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో మొదటి ర్యాంకులో ఉంది. 
వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి బడ్జెట్‌లో కనీసం పది శాతం కేటాయించాలి. కనీసం పెట్టుబడి దారీ దేశాలలోని వ్యవసాయ విధానాలనైనా పాటించాలి.
సారంపల్లి మల్లారెడ్డి
24.02.2014

No comments:

Post a Comment