Wednesday, 13 August 2014

23వ రాష్ట్ర మహాసభ నివేదిక

= రాష్ట్ర 23వ సిపిఐ(యం) మహాసభలు 2`4 ఫిబ్రవరి 2012 ఖమ్మంలో జరిగాయి.
= 1.50 లక్షల మందితో బహిరంగ సభ జరిగింది.
= అఖిల భారత కార్యదర్శి కామ్రేడ్‌ ప్రకాశ్‌కరత్‌, సీతారాం ఏచూరి, బి.వి. రాఘవులు, పాటూరు రామయ్య,           మల్లు స్వరాజ్యం, తమ్మినేని, గఫూర్‌ ప్రసంగించారు.
= మహాసభ పరిశీలనకు కామ్రేడ్‌ బృందాకరత్‌ హాజరయ్యారు.
ప్రచారం:
తెలంగాణ వాదన ఉన్నప్పటికీ :
            43 సంవత్సరాల తర్వాత ఖమ్మంలో రాష్ట్ర మహాసభ జరిగింది.
            82 సదస్సులు జరిగాయి ` ప్రబాత్‌ పట్నాయక్‌, సాయినాద్‌ హాజరయ్యారు.
            ఎగ్జిబిషన్‌ ` పాఠశాలల విద్యార్థులు హాజరు
            ప్రజానాట్య మండలి కార్యక్రమాలు
            జీపు జాతాలు, మోటారు సైకిల్‌ ర్యాలీలు, బోనాల ర్యాలీలు
            ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు
            డెలిగేట్స్‌ 710లో మహిళలు 98 మంది.
            240 మంది జైలు జీవితం, 47 మంది అజ్ఞాత జీవితం గడిపారు.
            1975కు ముందు పార్టీలో చేరినవారు 68 మంది ఉన్నారు.
            నూతన రాష్ట్రకమిటీ 81 మంది ` 15 మంది కార్యదర్శివర్గం.
            ప్రత్యేక ఆహ్వానితులు 5Ñ శివారెడ్డి, మల్లుస్వరాజ్యం, శర్మ, తేజేశ్వరరావు, కెవి
            కంట్రోల్‌ కమిషన్‌ 3: బిఆర్‌ తులసీరావు
            అఖిల భారత మహాసభ డెలిగేట్స్‌: 41G4G2 (వెటరన్స్‌), సికెసి 7R48 ఎంపిక.
           నిర్మాణ  చర్చల్లో 39 మంది 25 కేంద్రాల్లో
            ప్రజారంగాల్లో 29 మంది 27 రంగాల్లో
            తీర్మానాలు 18G25R43
కార్యక్రమాలు :
            భూపోరాటం
            నోడల్‌ ఏజెన్సీ కోసం, దళిత, గిరిజన సమస్యలపై
            వరద, కరువు సమస్యలపై
            గిరిజన ప్రాంతాల్లో వైద్యం
            సమస్యలపై సర్వేలు ` దీక్షలు
            స్థానిక సమస్యలు ` ప్రజా సమస్యలపై
            బడ్జెట్‌ వాటాకోసం ఉద్యమం
            క్లస్టర్‌ క్యాంపెయిన్‌
            నీటి ప్రాజెక్టుల సమస్యలపై
            ఉపాధి హామీపై కృషి
           కౌలు సమస్యలపై
            స్కాలర్‌షిపులు ` హాస్టల్స్‌ సమస్యలపై
            వామపక్ష పార్టీల ఉమ్మడి కార్యక్రమాలు
            మున్సిపల్‌ సంస్కరణలు ` భారాలు
            కేంద్ర కమిటీ విస్తృత సమావేశాలు
            ఇతర సమస్యలు   
పార్టీ ఎత్తుగడలు :
1. రాష్ట్ర సమైక్యత కోసం నిలబడుతూనే ప్రత్యేక తెలంగాణా ఉద్యమంతో ప్రత్యక్షంగా సంఘర్షణా వైఖరి తీసుకోకుండా వ్యవహరించాలి.
2. సమైక్యత పేరుతో ఆందోళన చేస్తున్న అవకాశవాద శక్తులకు దూరంగా వుండాలి
3. విశాల, రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు, సమీకరణల కన్నా ఎక్కడికక్కడ స్థానిక సమస్యలపై కేంద్రీకరించి ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించాలి
4. అన్ని వైపుల నుండి (ప్రాంతీయ తత్వం, కులతత్వం, నిరాశావాదం) పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే సైద్ధాంతిక దాడి నుండి పార్టీని రక్షించుకోవడానికి, ఐక్యతను బలపర్చుకోవడానికి రాజకీయ విద్యా కృషిని పెంచాలి. స్టడీసర్కిల్స్‌ను నిరంతరాయంగా నిర్వహించాలి.
పైన పేర్కొన్న ఎత్తుగడలను అమలు చేసేందుకు పార్టీ శాయశక్తులా కృషి చేసింది. క్లిష్ట సమయంలో, అననుకూల పరిస్థితుల్లో ఉద్యమాన్ని ప్రతీపశక్తుల నుండి రక్షించుకునేందుకు, ప్రజలతో సంబంధాలు చెదరకుండా కాపాడుకునేందుకు మనం అనుసరించిన ఎత్తుగడలు ఉపయోగపడ్డాయి.
ప్రస్తుత ఎత్తుగడలు:
1. వామపక్ష ప్రజాస్వామ్య శక్తులను ఉద్యమాలలోకి కూడగట్టి పరిస్థితిని సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి.
2. స్థానిక, దైనందిన సమస్యలపై కృషిని ముమ్మరం చేయాలి.
3. రాజకీయ విద్య, స్టడీసర్కిల్స్‌ కృషిని కొనసాగించాలి.
4. పార్టీ ప్రజాఉద్యమాలు బలపడే విధంగా ఎన్నికల ఎత్తుగడలను రూపొందించుకోవాలి.
విస్తరణ:
1. పెరిగిన పార్టీ ప్రతిష్టను ప్రజా మద్ధతుగా మార్చుకోడానికి ఉపయోగపడుతుంది.
2. పార్టీ విధానాన్ని అన్ని ప్రాంతాలకు తీసుకుపోయేందుకు తోడ్పడుతుంది.
3. మండలంలో స్పాంటేనియస్‌గా ఉద్యమాలొస్తే పార్టీ జోక్యం చేసుకునేందుకు వీలవుతుంది.  
4. మండల కేంద్రంలో (ప్రజా సంఘాల పేరుతో) ఆఫీసు నిర్వహణ ద్వారా పార్టీ, ప్రజా సంఘాలను సమన్వయం చేయవచ్చు.
5. మండల ఆఫీసులకు పనులకై వచ్చే వారికి (ఈ ఆఫీసులు) కేంద్రంగా వుంటుంది.
6. వివిధ ప్రజా సంఘాలను ఆర్గనైజ్‌ చేయడం సులభమవుతుంది. సభ్యత్వాలు పెరుగుదలకుపయోగపడుతుంది.
7. మండలంలోని పార్టీ అభిమానులకు ఒక కేంద్రంగా మారుతుంది.
8. మండల కేంద్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు ప్రచారం విస్తృతంగా వుంటుంది.
9. పార్టీ తరఫున అధికార్లకు రాయబారాలు చేయవచ్చు.
10. అధికార, అనధికార కార్యక్రమాల్లో అవసరమైనప్పుడు పార్టీ ప్రాతినిధ్యం వహించవచ్చు.
11. మండలంలోని సమస్యలపై పత్రికలకు వార్తలు పంపవచ్చు
12. వివిధ గ్రామాలకు సమాచారాన్ని పంపడం సులభంగా వుంటుంది.
13. ప్రజాశక్తి పేపరు తెప్పించడం వివిధ గ్రామాలకు పంపించడం సులభమవుతుంది.
2009 ఎన్నికలు:
2009లో ఏప్రిల్‌లో పార్లమెంట్‌తో పాటు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 156 (36.56%), తెలుగుదేశం 92(28.12%), టిఆర్‌ఎస్‌ 10 (3.99%), ఎంఐఎం 7(0.83%), బిజెపి 2 (2.84%), పిఆర్‌పి 18(16%) సిపిఐ 4 (1.31%), సిపిఎం`1(1.35%),లోక్‌సత్తా`1(1.80%) సీట్లు గెలుచుకున్నాయి. గతంలోకన్నా కాంగ్రెస్‌కు 29 తగ్గాయి. తెలుగుదేశానికి 45 పెరిగాయి. వామపక్షాలకు ప్రత్యేకంగా సిపిఎంకు సీట్లు తగ్గాయి. లోక్‌సత్తా మధ్యతరగతిలో కొన్ని ఓట్లు తెచ్చుకున్నది. ఓటింగ్‌ శాతాలను పరిశీలిస్తే కాంగ్రెస్‌కు 2%, టిడిపి 9.47% టిఆర్‌ఎస్‌ 2.69 శాతం తగ్గింది. సిపిఐ 0.22శాతం, సిపిఎం 0.49శాతం ఓటింగ్‌ కోల్పోయాయి. పార్లమెంట్‌ స్థానాలకు వచ్చిన సీట్లు, ఓటింగ్‌ చూస్తే కాంగ్రెస్‌ అసెంబ్లీ స్థానాల కన్నా మెరుగ్గా ఫలితాలను సాధించింది.
కేంద్రీకరణకు తీసుకోవాల్సిన చర్యలు:
1) ప్రతి మండలానికి పూర్తికాలం కార్యకర్తను వెంటనే కేటాయించాలి. 
2) మండలాన్ని జోన్లుగా విభజించి జోన్‌ బాధ్యులను నియమించాలి.
3) ప్రతి గ్రామానికి/వార్డుకు గ్రామ బాధ్యున్ని నియమించాలి.
4) గ్రామ/వార్డు - రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితిని విశ్లేషణ చేయాలి.
5) విశ్లేషణ ప్రాతిపదికగా మండల/గ్రామ/వార్డు ప్రణాళికను రూపొందించాలి.
6) అలాగే గుర్తించిన ప్రజా సమస్యల ప్రాతిపదికగా నిరంతరం స్థానిక సమస్యలపై కృషి చేయాలి.
7) ప్రతి ప్రజాసంఘం కేంద్రీకరించాల్సిన మండలాల్లో తన కార్యకలాపాలకు ప్రాధాన్యత నివ్వాలి.
8) అవకాశం ఉన్న అన్ని గ్రామాల్లోనూ ఆగ్జిలరీ శాఖలను ఏర్పాటు చేయాలి.
9) జోన్‌ బాధ్యుల సమావేశం క్రమం తప్పకుండా నిర్వహిస్తూ కృషిని సమీక్షిస్తుండాలి.
10) రాష్ట్ర స్థాయి ప్రజా వుద్యమాలను ఈ మండలాల్లో గ్రామ స్థాయి వరకు నిర్వహించాలి.
11) మండల కేంద్రాన్ని ఆందోళనా - ప్రచార కేంద్రంగా అభివృద్ది చేయాలి.
కామేడ్స్ర్‌
 అననుకూల పరిస్థితులను అధిగమిద్దాం. సానుకూల పరిస్థితులను ఉపయోగించుకుందాం. బాధిత ప్రజలను సమీకరిద్దాం. క్షేత్రస్థాయి కృషిని ముమ్మరం చేద్దాం.  క్షేత్రస్థాయి నిర్మాణాన్ని చేద్దాం. అసంఖ్యాక సంస్థలను స్థాపిద్దాం. కేంద్రీకరణ` విస్తరణ వ్యూహంపై శ్రద్ద పెంచుదాం. అన్యవర్గ భావాలను, పొరపాటు ధోరణులను ప్రక్షాళన చేద్దాం. నిర్మాణానికి పదును పెడదాం. వామపక్ష ప్రజాతంత్ర శక్తులను బలోపేతం చేయడానికి ముందుకు పోదాం.
కర్తవ్యాలు
(1)     ఫిబ్రవరి 28 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. ఆ రోజున ప్రజాసంఘాల బంద్‌    గురించి ఆలోచించాలి.
(2)     విద్యుత్‌ చార్జీల పెంపుపై బహిరంగ చర్చ సందర్భంగా నిజామాబాదు(16),కాకినాడ(  ),  తిరుపతి  (    ), హైదరాబాదు (    )లలో ముందుగా వామపక్ష పార్టీలతో సదస్సులు  నిర్వహించాలి. పార్టీ బుక్‌లెట్స్‌ను విరివిగా అమ్మాలి.
(3)     కౌలుదార్ల గుర్తింపు కార్డుల మంజూరు కార్యక్రమం మార్చి నెల మొదట్లో ప్రారంభమవుతుంది.  
ఈ కార్యక్రమంలో జోక్యం చేసుకునేందుకు ఇప్పటి నుండి సన్నాహం చేయాలి.
(4)     ఎస్సీ/ ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకై ప్రజాసంఘాల కమిటీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయిలో చురుకుగా పాల్గొనాలి.
(5)     గ్రామీణ ప్రాంతాల్లో భూ ఆక్రమణ ఉద్యమాన్ని రూపొందించి ఏప్రియల్‌లో చేపట్టాలి.                
     స్పందించే కేంద్రాలలో దీర్ఘకాలం కొనసాగించాలి.
(6)     పట్టణాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాల ఉద్యమాన్ని మార్చి నెలలో చేయాలి.
(7)     జివో నెం. 3 అమలుకోసం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రత్యేక కాంపెయిన్‌ చేయాలి.
(8)    కరువు ప్రాంతాల రైతులకు నష్టపరిహారం, నిబంధనలను సడలించి, ప్రతిగ్రామంలో  అడిగిన  వారందరికీ ఉపాధి పని కల్పించాలి.
(9)     జిల్లా స్థాయిలో ప్రాధాన్యతలను బట్టి ప్రాజెక్టుల వారీగా జలసాధన యాత్రలు చేయాలి.
(10)    మద్యం బెల్టుషాపులకు వ్యతిరేకంగా యువజనసంఘం, మహిళాసంఘాలు సంయుక్తంగా  ప్రాజెక్టు కార్యక్రమం రూపొందించుకోవాలి.

` సారంపల్లి మల్లారెడ్డి
08.02.2012

No comments:

Post a Comment